మంత్రులంతా బిజీబిజీ… ఆ ముద్ర చెరిపేందుకేనా?

అంద‌రూ ఒక్క‌సారిగా బిజీ అయిపోయారు! ఒక‌రేమో పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌తో మాట్లాడుతుంటే, మ‌రొక‌రేమో ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్నారు! ఒక‌రేమో ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల‌పై దృష్టిపెట్టి ప‌ర్య‌టిస్తుంటే, మ‌రొక‌రేమో దేవాల‌యాల్లో స‌దుపాయాల‌ను మెరుగు చేసే ప‌నుల్లోప‌డ్డారు. తెలంగాణ మంత్రులంతా ఇప్పుడు బిజీబిజీగా జిల్లాల్లో గ‌డుపుతున్నారు. మ‌రీ ముఖ్యంగా… గ‌త‌వారం రోజులుగా చూసుకుంటే వారి హ‌డావుడి మ‌రింతగా క‌నిపిస్తోంది.

మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టించి మంత్రి హ‌రీష్ రావు… తూఫ్రాన్ మండలంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… విద్యార్థుల కోసం ప్ర‌భుత్వం చెయ్యాల్సినంతా చేస్తోంద‌నీ, వీరంతా భ‌విష్య‌త్తులో ప్ర‌పంచంతో పోటీప‌డేలా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. మంత్రి ఈటెల రాజేంద‌ర్… హైద‌రాబాద్ నేచ‌ర్ క్యూర్ లో ఓపీ సేవ‌లు ప్రారంభిస్తామ‌న్నారు. సంప్ర‌దాయ వైద్యానికి పున‌ర్వైభ‌వం తీసుకొస్తామ‌న్నారు. ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్… ఖ‌మ్మం నుంచి కొత్త‌గూడెం వ‌ర‌కూ ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ముగింపు స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు క‌దా… మంత్రులూ ఎమ్మెల్యేలూ నెల‌కి ఒక‌సారైనా ఆర్టీసీలో ప్ర‌యాణించాల‌ని! దాన్ని తు.చ‌. తప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. ఆర్టీసీలో స‌రుకుల ర‌వాణా త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌నీ, లాభాల బాట‌లో సంస్థ‌ను న‌డిపించాల‌న్న స‌దుద్దేశంతో ఉన్నామ‌న్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు… ఖ‌మ్మం, మెహ‌బుబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు. మెహ‌బుబాబాద్ జిల్లా ఆసుప‌త్రిని ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించారు. ప‌రిశుభ్ర‌త బాగులేద‌ని ఆగ్ర‌హించి, కాంట్రాక్ట‌రును అప్ప‌టిక‌ప్పుడే తొల‌గిస్తున్న‌ట్టు ఆదేశించారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో మంత్రి స‌బితారెడ్డి, మంత్రి మ‌ల్లారెడ్డి ప‌ర్య‌టించి మ‌రికొన్ని కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఉన్న‌ట్టుండి మంత్రులంతా ఇలా ఒకేసారి జిల్లాల బాట ప‌ట్టేసి, ప్ర‌జ‌ల్లోకి దూకుడుగా వెళ్తున్నారేంటి..? రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. కేసీఆర్ స‌ర్కారు రెండో ద‌ఫాకి ఏడాది పూర్త‌యింది. ఏడాది గ‌డుస్తున్నా చేసిందేం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ఈ ఏడాదిలో ఏం సాధించారో చెప్పుకునేందుకు మంత్రుల ద‌గ్గ‌రా ప్ర‌త్యేకంగా కంటెంట్ ఏం లేదు! అలాంటి చ‌ర్చ ప్ర‌జ‌ల్లో రాకుండా ఉండాలంటే, ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున విమ‌ర్శించ‌కుండా ఉండాలంటే… నేత‌లు జ‌నంలో ఉండాలి, ఉంటున్నారు. ఇక‌, రెండో కార‌ణం… త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. చేసిన‌వి చెప్పుకోవాలి, లేదా చేయ‌బోయేవి చెప్పాలి. ఇప్పుడు మంత్రులంతా జిల్లాల పేరుతో చేస్తున్న‌ది ఇదే ప్ర‌య‌త్నం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close