రోజాకు టిక్కెట్ ఎగ్గొట్టే స్క్రీన్ ప్లే స్టార్ట్ !

వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్ ఉందో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆమెకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు స్క్రీన్ ప్లే మాత్రం ప్రారంభమయిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరి నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా దళిత కౌన్సిలర్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. రోజా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని కానీ ప దవి ఇవ్వలేదని ఆరోపించారు. తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను దళిత మహిళా కౌన్సిలర్ స్పందించారు.

మరో వైపు చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే, మంత్రిరోజా.. పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చేయనివ్వడం లేదని.. వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమెకు మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని చాలెంజ్ చేశారు. నిజానికి రోజాకు.. నియోజకవర్గంలో ఏ ఒక్క నేతతోనూ సంబంధాలు ఉండవు. అందరితోనూ గొడవలే. పైగా పార్టీ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆమెకు ఎదురుగాలి వీస్తోందని అనేక సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆమెకు టిక్కెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. కానీ రోజా చేసే రచ్చ పార్టీకి డ్యామేజ్ అవుతుందని వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మార్చాలనుకోవడంతో.. మెల్లగా రోజాకు వ్యతిరేకంగా ఉన్న వారిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజా మళ్లీ పోటీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close