టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా సభ్యత్వాలు..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు.. సభ్యత్వాల పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గంలో కనీసం యాభై వేల సభ్యత్వాలు కావాలని… పార్టీ నేతలకు టార్గెట్ పెట్టారు. సహజంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు మీదే పడుతుంది. ఇప్పుడు.. ఆ సభ్యత్వాలు చేయించడం.. వారికి తలకు మించిన భారంగా మారింది. సభ్యత్వ రుసుం కట్టడం మాత్రమే సమస్య కాదు… అందర్నీ ఎన్‌రోల్ చేయించడం కూడాసమస్యగా మారింది. ఎవరి పేర్లుపడితే వారి పేర్లురాసేసి.. సభ్యత్వ చందా తాము కట్టేస్తే పని పూర్తయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఓటర్ ఐడీతో సహా డేటా మొత్తం సేకరించాల్సి ఉంది. యాప్‌లో నమోదు చేయించాల్సి ఉంది.

అలా చేయించడానికి ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లక పెద్దగా కార్యకర్తలు దొరకడంలేదు. ఉన్న వారందరికీ సభ్యత్వాలు చేయించినా.. పదివేలకు మించి కావడం లేదు. దాంతో ప్రభుత్వ పథకాలు పొందిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు పొందే వారందరూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని.. లేకపోతే పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు దిగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అదే పనిలో ఉన్నారు. గ్రామాల్లో సభలు పెట్టి.. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికే ఇక పథకాలు వస్తాయని బెదిరిస్తున్నారు. వీరి మాటల్ని కొంత మంది వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో అవి వైరల్ అయ్యాయి. ఇతర పార్టీల నేతలు బహిరంగంగా చెప్పకపోయినా అదే తరహా బెదిరింపులకు పాల్పడి సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు.అయినా అనుకున్నన్ని సాధ్యం కావడం లేదు. కనీసం యాభై లక్షల సభ్యత్వాలు చేయించాలని.. కేటీఆర్ కూడా.. టార్గెట్ పెట్టుకున్నారు.అయితే ఇతర అంశాలు హైలెట్ అవుతూండటంతో … సభ్యత్వాలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడ లేదు. కానీ పార్టీ ఆఫీసు నుంచి అదే పనిగా రిమైండర్లు వస్తూండటంతో.. ఇలా బెదిరింపులకు దిగడానికి వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close