తెలకపల్లి రవి : కేంద్రంలో చేరబోమన్న గులాబీ ఎంపి

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన తర్వాత టిఆర్‌ఎస్‌ సభ్యులు మోడీ మంత్రివర్గంలో చేరతారని సాక్షి పతాక శీర్షిక నిచ్చింది. దాంతోపాటే ఎవరెవరు చేరేది పేర్లు కూడా ప్రకటించింది. అదే సమయంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ప్రభుత్వంలో చేరడం లేదని ప్రకటించారు. సమస్యలను బట్టి తమ మద్దతువుంటుందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా కేంద్రంతో సానుకూలత పెరిగిందనే సంకేతాలు ఆయన కూడా ఇచ్చారు. తెలంగాణలో బిజెపి నేతలైతే టిఆర్‌ఎస్‌ చేరిక ఖాయమనీ, ఇక తమ పరిస్థితి మరింత గందరగోళమవుతుందని భయపడుతున్నారు. దీని ఫలితంగా తమతో సంబంధాలు తెంచుకుంటారని తెలుగుదేశం భావిస్తున్నది. అయితే టిఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎంపి ఒకరితో మాట్లాడినప్పుడు కేంద్రంతో తమ సంబంధాలలో ఎలాటి మార్పు లేదని నాతో చెప్పారు. మోడీ బృందంలో చేరే జాబితాలో వున్న ఆ నేత ఇవన్నీ వూహాగానాలేనని కొట్టిపారేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గతానికి భిన్నంగా ఎన్నికలు… ఏపీ ప్రజల మద్దతు ఎవరికీ..?

ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ - కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం...

ఏపీలో ఇంత డబ్బు.. నోట్లు ఎలా ?

ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్‌కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా...

తల్లి సపోర్టూ లేని జగన్ – షర్మిలను గెలిపించాలని విజయలక్ష్మి పిలుపు

జగన్మోహన్ రెడ్డి సర్వం కోల్పోయారు. చివరికి తన తల్లి సపోర్టును కోల్పోయారు. వైసీపీని ఓడించి తన కుమార్తె షర్మిలను గెలిపించాలని ఆమె అమెరికా నుంచి వీడియో విడుదల చేశారు....

స్నేహితుడి కోసమే అర్జున్ – కానీ వాడేసిన వైసీపీ

హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన కలకలం రేపింది. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు అయిన రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎదురీదుతూండటంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close