టీఆర్ఎస్ ఎంపీ ఆస్తులు జప్తు – ఈడీ టెస్ట్ డ్రైవా ?

ఓ వైపు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూంటే మరో వైపు టీఆర్ఎస్ ఆ పార్టీకి చికాకు పుట్టేలా కార్యక్రమాలు చేస్తోంది. ప్రచారం రాకుండా చేస్తోంది. బ్యాంకుల్ని దోచుకున్నవారు వేరే.. అసలు దేశాన్నే మోడీ దోచేస్తున్నారని మనీహీస్ట్ క్యారెక్టర్లతో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఇలా ఉండగానే ఈడీ నుంచి టీఆర్ఎస్‌కు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. అదేమిటంటే… టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థల ఆస్తులను జప్తు చేయడం.

రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.96 కోట్ల విలువైన మొత్తం 105 ఆస్తులు అటాచ్ చేసినట్లుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి.

అయితే అప్పట్లో సైలెంట్ అయిపోయిన ఈడీ ఇప్పుడు హఠాత్తుగా అటాచ్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఏదో సిగ్నల్ పంపారనే అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీపై దూకుడుగా వెళ్తున్న టీఆర్ఎస్‌కు ముందు ముందు చాలా ఉంటాయని.. ఈడీ ఎంపీ నామా విషయంలో టెస్ట్ డ్రైవ్ మాత్రమే చేసిందని బీజేపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ కు అయినా ఈ మ్యాటర్ అంత తేలిగ్గా తీసుకునేది కాదని తెలిసే ఉటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close