ముఖ్యమంత్రి వద్దన్న పనే చేసిన టీ-ఆర్టీసి ఉద్యోగులు

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఆర్టీసి పరిస్థితిని సమీక్షిస్తూ చేసిన మొట్ట మొదటి సూచన ఏమిటంటే చీటికి మాటికీ సమ్మెలు చేయవద్దని! ఆర్టీసి ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరిస్తే సరేసరి లేకుంటే ప్రైవేట్ పరం చేసేస్తానని హెచ్చరించారు కూడా. అసాధ్యం అనుకొన్న తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకోగలిగినప్పుడు, అందరూ సమిష్టిగా కృషి చేసి నష్టాలలో ఉన్న ఆర్టీసిని లాభాల బాటలోకి మళ్ళించుకోలేమా? అని ప్రశ్నించారు. ఆర్టీసికి ఆదాయమార్గాలు పెంచుకోవడానికి ఆయన చాలా మంచి సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. కెసిఆర్ తన మాటలతో ఆర్టీసి అధికారులకి ప్రేరణ కల్పించగలిగారు. కానీ ఆర్టీసి ఉద్యోగులు ఆయన హెచ్చరికలను, సలహాలను పెడచెవిన పెట్టి గురువారం ఒక్క రోజు సమ్మెకి దిగుతున్నారు.

ఆర్టీసిలో ఉన్న ఏడు కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. వేతన సవరణ, డిఏ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్ బకాయిల చెల్లించాలని కోరుతూ సమ్మె చేస్తున్నాయి. వారి డిమాండ్లు సహేతుకమైనవె అయినప్పటికీ, ఈ సమస్యని మొన్న వారందరూ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసినప్పుడు ఆయన ముందుంచి పరిష్కరించమని కోరి ఉంటే బాగుండేది. ఆర్టీసిని గాడిన పెట్టేందుకు దాని సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వారి సమస్యని కూడా తప్పకుండా పరిష్కరించి ఉండేవారు. ఒకవేళ ఉద్యోగులు తమ సమస్యని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ఉండి ఉంటే, ఆయన మాటకి గౌరవం ఇచ్చి మరికొంత కాలం వేచి చూస్తే బాగుండేది. అప్పటికీ వారి సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు సమ్మె చేసినా ఎవరూ వారిని తప్పు పట్టి ఉండేవారు కాదు! కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించిన మూడు నాలుగు రోజులకే సమ్మెకి దిగడం ఆయనకి సవాలు విసిరినట్లే అయ్యింది. దాని వలన ఎవరికి నష్టం? ఆర్టీసి ఉద్యోగులు ఆలోచించుకొని ఉంటే బాగుండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close