టీటీడీకి స్వరూపానంద తర్వాతే శ్రీవారు..!

దేవదేవుని దర్శనం కోసం… అమెరికా నుంచి బయలుదేరినా… గోవిందుని నామస్మరణమే చేస్తారు. కానీ.. శ్రీవారి సేవలో ఉండేవారు మాత్రం..ఆ శ్రీవారిని తప్ప… ప్రభుత్వ పెద్దలకు ఇష్టమైన వారందరి నామస్మరణ చేస్తూంటారు. టీటీడీ అధికారులు. ఉద్యోగులు.. శ్రీవారి కన్నా… స్వరూపానందకే ప్రాధాన్యం ఇస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వరూపానందేంద్రకు… టీటీడీ అధికారులు నేరుగా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికేశారు. ఇప్పటి వరకూ ఏ పీఠాధిపతికి కానీ.. ముఖ్యమంత్రికి కానీ.. గవర్నర్‌కు కానీ…రాష్ట్రపతికి కానీ.. చివరికి ప్రధానమంత్రికి కూడా అలిపిరి వద్దకు వెళ్లి స్వాగతం పలికిన సందర్భం లేదు.

అంతే కాదు.. స్వరూపానందను స్వాగతం చెప్పిన పద్దతి కూడా.. శ్రీవారిని కించపరిచేలా ఉంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ధనుర్మాసం లో జరిగే తిరుప్పావై ఉత్సవాల సందర్భంగా మూల విరాట్ కు శంఖం ఎడమచేతి వద్ద ప్రతిరోజు గోదాదేవి జ్ఞాపకార్థంగా అలంకరించే పవిత్ర ఆకులతో తయారు చేసిన ధనుర్మాస చిలకను తిరుమల ఆలయం నుంచి అలిపిరి వద్దకు తీసుకొచ్చి స్వరూపానందకు ఇచ్చారు. ఇది ఆలయ నిబంధనలకు విరుద్ధం. శ్రీ వారికి అలంకారం చేసిన పూలమాలలను బయటకు ఇవ్వకూడదు. వీటిని తీసుకొచ్చి.. స్వరూపానందకు వేశారు. ఇవన్నీ తీవ్ర విమర్శల పాలవుతూండగా.. కొత్తగా శ్రీవారి నిధులు కూడా.. శారదా పీఠానికి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
   
జనవరి 3వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మపరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానంద నిర్ణయించారు. దీనికి నిధులు కేటాయించాలని… స్వరూపానంద ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం.. బాగా ఆదాయం ఉన్న ఆలయాలకు సాయం చేసే అవకాశాలు పరిశీలించాలని లేఖ రాశారు. ఇందులో తిరుమల కూడా ఉంది. మంజూరు చేయడం… మాత్రమే మిగిలిందని.. స్వరూపానందకు ప్రభుత్వంలో ఉన్న ప్రాధాన్యత చూస్తే తెలిసిపోతుందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close