అలా చేయడం టీటీడీపీ ఓవర్ ఏక్షన్ కాదా?

తెలంగాణ లో టీటీడీపీ, బీజేపీ పార్టీలు అసలు మిత్ర పక్షాలేనా అనే అనుమానం కలుగుతోంది. ఈ రెండు పార్టీలలో ఏ ఒక్కరు కూడా.. మిత్రధర్మం పాటిస్తున్న సూచనలు కనిపించడం లేదు. మరో కోణంలోంచి చూసినప్పుడు వీరిద్దరి మధ్య మిత్ర బంధం ఏనాడో మంటగలిసి పోయిందని అనిపిస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కూడా వీరి మధ్య బంధం పుటుక్కు మన్నదనడానికి నిదర్శనం గా నిలుస్తున్నది. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం కొంత ఓవర్ ఏక్షన్ చేసి, బీజేపీ ని విస్మరించి నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే… పాలేరులో తమకు మద్దతు ఇవ్వ వలసినదిగా కాంగ్రెస్, టీడీపీని సంప్రదించింది. అంతవరకూ ఓకే. టీడీపీ తమకు మిత్ర పక్షం గనుక బీజేపీ ని కూడా సంప్రదించి సమష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. వారు తమ పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడుకుని, అక్కడికి తమ సొంత నిర్ణయం వెలిబుచ్చేసారు. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే పాలేరు విషయంలో టీడీపీ తమను సంప్రదించలేదనే ఆరోపణ చేయకుండానే, తమ పాటికి తాము మరో నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది.

పాలేరులో పోటీ విషయం కేంద్ర నాయకత్వంతో మాట్లాడి చెబుతాం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. అంటే టీడీపీని వారు లెక్కలోకి తీసుకోవడం లేదని స్పష్టంగా అర్ధం అయిపోతున్నది. నిజానికి ఈ రెండు పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు వ్యవహరించడం మునిసిపల్ ఎన్నికల్లోనే తేలిపోయింది. మిత్రబంధం అనేది ఏనాడో గాలికి కొట్టుకు పోయినట్లున్నది. వారుగా తమ పార్టీలు విడిపోయినట్లు అధికారిక ప్రకటన చేయలేదు గనుక మనం మిత్రులు అనే భ్రమలో ఉండాల్సిందే తప్ప, అసలక్కడ అలాంటి సూచన లేదని అంతా అంటున్నారు. పాలేరు విషయంలో మాత్రం టీటీడీపీ నే తప్పు చేసిందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close