ఏపీలోలా కరోనాను కట్టడి చేయాలంటున్న ఉత్తమ్..!

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో పాలన బాగా నచ్చుతోంది. మిగతా విషయాల్లో ఏమో కానీ..కరోనాను ఎలా కట్టడి చేయాలంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఏపీలా అనే సమాధానం చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నిర్మోహమాటంగా… కరోనా కట్టడిపై ఏపీని చూసి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సలహా ఇచ్చేశారు. కరోనా వైద్యం సరిగ్గా అందడం లేదన్న కారణంగా భట్టి విక్రమార్క ఆస్పత్రుల పర్యటనకు వెళ్లారు. ఈ అంశంపై హైదరాబాద్‌లో మాట్లాడిన ఉత్తమ్‌… సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు భరించలేకపోతున్నారని .. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు భయపడుతున్నారని విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని గవర్నరే చెప్పారని ఉత్తమ్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కరోనా ఎక్కువ ఉందో.. తక్కువ ఉందో అంచనా వేయడం కష్టం కానీ.. ఏపీలో మాత్రం..కరోనా కంట్రోల్ తప్పిపోయిందని..అక్కడ రోజువారీగా నమోదవుతున్న కేసులు… మరణాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో పల్లె పల్లెకు కరోనా విస్తరించింది. మెట్రో సిటీలు లేకపోయినా… అంత విస్తృతంగా కరోనా వ్యాప్తిచెందడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏపీతో పోలిస్తే..తెలంగాణలో చాలా పరిమితంగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలోలా లక్షణాలతో పెద్ద ఎత్తున ఆస్పత్రులకు రావడం లేదు. అయితే..కరోనా అంశాన్ని హైలెట్ చేసుకోవాలుకుంటున్న టీ కాంగ్రెస్ .. కేసీఆర్ ను విమర్శించడానికి ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడమే..కాస్త వింతగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close