ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి డి. వెంకట సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లుగా కోర్టులో పిటిషన్ వేశారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ 2, ఏ 3గా ఉన్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో బకరాలు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి
అధికారంలోకి రాగానే లిక్కర్ స్కాం చేయడానికి పెద్ద స్కెచ్ రెడీ చేసుకున్న జగన్ రెడ్డి గ్యాంగ్.. బకరాల్ని కూడా ముందుగానే ఖరారు చేసుకున్నారు. ఎక్కడో రైల్వే ట్రాఫిక్లో పని చేసే..తెలంగాణకు చెందిన వాసుదెవరెడ్డిని, ఐఏఎస్కు ప్రమోట్ చేస్తామని సత్యప్రసాద్ అనే అధికారిని ముందుపెట్టి మొత్తం స్కాం నడిపించారు. వీరు నిమిత్త మాత్రులు. కానీ అంతా వీరి పేరుపైనే జరిగింది.
వారు సంపాదించుకున్నారు.. వీరు బుక్కయిపోయారు!
2019 సెప్టెంబర్ 13న రైల్వేల నుంచి డిప్యూటేషన్పై ఏపీఎస్బీసీఎల్ ఎండీగా, తర్వాత డిస్టిలరీల కమిషనర్గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతోనే ఈ నియామకాలు జరిగాయి. అతను లిక్కర్ ఆర్డర్ వ్యవస్థను మాన్యువల్గా మార్చి, సిండికేట్ ప్రణాళికలు అమలు చేశారు. సత్యప్రసాద్ రెవెన్యూ ఎక్సైజ్ శాఖలో ఉండేవారు. మిథున్ రెడ్డి .. IAS ప్రమోషన్ హామీతో డిపోల సరఫరాలు, గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లలో అమ్మకాలను నియంత్రించి, కిక్బ్యాక్ ఆధారంగా ఇండెంట్ ప్లాన్లు తయారు చేశారు. వాట్సాప్ గ్రూప్లు, పర్సనల్ ల్యాప్టాప్ల ద్వారా డిపో మేనేజర్లతో సమన్వయం చేశారు.
మొత్తం బయట పెట్టేసిన అప్రూవర్లు
గతంలోనే ఏసీబీ కోర్టులో ఈ ఇద్దరూ అప్రూవర్ పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ కు పూర్తిగా సహకరిస్తున్నామని స్కాంపై అన్ని వివరాలు అందిస్తున్నామన్నారు. కానీ ఆగస్టులో న్యాయమూర్తి వీరి పిటిషన్లు తిరస్కరించారు. స్కాంలో వీరి పాత్ర కీలకంగా ఉందన్నారు. ఇప్పుడు మరోసారి అప్రూవర్ అయ్యామని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరు అన్ని వివరాలు చెప్పి సహకరిస్తూండటంతో లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చూపించలేదు.