వెంకయ్య నాయుడు ఈసారి ఏపి నుండి రాజ్యసభకి ఎంపిక?

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎం. వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిల రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగుస్తుంది. వారిలో వెంకయ్య నాయుడుకి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకున్న మూడు రాజ్యసభ స్థానాలలో ఒకటి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసినపుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించవచ్చును.

ఏపిలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలున్నాయి. వాటిలో తెదేపాకున్న శాసనసభ్యుల సంఖ్యా బలానికి మొత్తం మూడు స్థానాలు దక్కుతాయి. మరొకటి వైకాపాకు దక్కుతుంది. ఆ మూడింటిలో ఒక దానిని రాష్ట్రానికి చాలా సహాయపడుతున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు కనుక మిగిలిన రెండు స్థానాల కోసం చాలా పోటీ ఉంటుంది.

కేంద్రమంత్రి సుజనా చౌదరిల రాజ్యసభ పదవీకాలం కూడా జూన్ లోనే పూర్తయిపోతుంది. ఆయన తన పదవిలో కొనసాగాలంటే ఆరు నెలలోగా తప్పనిసరిగా లోక్ సభ లేదా రాజ్యసభలలో దేనిలో ఒకదానిలో సభ్యుడుగా ఎన్నిక కావలసి ఉంటుంది. కనుక మళ్ళీ ఆయనకే రాజ్యసభ సీటు కేటాయించవలసి ఉంటుంది. కానీ ఈసారి ఆయన రాజ్యసభ సీటుని నారా లోకేష్ కి కేటాయించి, కొడుకుని కేంద్ర మంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు అనుకొంటున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెదేపా నేతలెవరూ ఆ వార్తలను దృవీకరించలేదు. ఒకవేళ ఆ సీటు నారా లోకేష్ కి కేటాయించకపోతే మళ్ళీ సుజనా చౌదరికే కేటాయించవచ్చును. మిగిలిన ఒక్క సీటుకి తెదేపాలో చాలా మంది పోటీ పడుతున్నారు కనుక ఈసారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి కేటాయించలేకపోవచ్చును. కనుక ఈసారి ఆమె వేరే రాష్ట్రం నుండి రాజ్యసభ సీటు సంపాదించుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close