షర్మిలకో న్యాయం… చింతమనేనికి ఓ న్యాయమా…!

ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా.. విజయసాయిరెడ్డికి.. రాజకీయాల్లో రాక ముందు వరకూ.. ఓ గుర్తింపు ఉండేది. ఆయనకు చాలా సంస్కారం ఉంటుందని… అనుకునేవాళ్లు. కానీ.. రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు…చదువు అబ్బింది కానీ.. సంస్కారం అబ్బలేదన్న విషయం.. ఆయన మాటల ద్వారా తరచూ బయట పెట్టుకుంటూ ఉంటారు. తాజాగా.. తనకు రివర్స్ కౌంటర్లు వస్తాయని.. తెలిసి కూడా.. ఆయన ట్వీట్లు ఏ మాత్రం మానుకోవడం లేదు. చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో… కొంత మంది వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అలా అరెస్ట్ చేయడం .. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ.. ఓ లాజిక్ బయటకు తీసి.. దాన్ని ట్వీట్ రూపంలో పెట్టి.. తాను కూడా.. ఆ వీడియోను.. ట్వీట్ చేస్తున్నానని.. దమ్ముంటే.. చర్యలు తీసుకోవాలని సవాల్ కూడా చేశారు. ఆ ట్వీట్ చూసి.. వైసీపీ నేతలే… ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం.. జగన్ సోదరి షర్మిల.. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని… దాని వెనుక టీడీపీ ఉందని.. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షర్మిల ఫిర్యాదుపై… అఘమేఘాలపై స్పందించిన తెలంగాణ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఆ వీడియోల సృష్టికర్తలెవరో.. తెలుసుకోవడం క్షణాల్లో పని. అది మాత్రం చేయకుండా.. ఎవరో.. ఇద్దరు కుర్రాళ్లు… ఆ వీడియోల కింద అసభ్య కామెంట్లు చేశారని అరెస్ట్ చేసి.. సైలెంటయిపోయారు. ఇప్పుడా కేసు ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ.. ఆ కేసుకు అంత ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ నేతలకు కానీ… పోలీసులకు కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినంతనే… అరెస్ట్ చేయకూడదనే… సుప్రీంకోర్టు తీర్పు గుర్తు కాలేదా..? లేక అప్పట్లో విజయసాయిరెడ్డికి తెలిసిన విషయం కూడా ఎవరికీ తెలియదా..? అన్న కామెంట్లు… సోషల్ మీడియాలో గట్టిగానే పడుతున్నాయి.

నిజానికి ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి పోస్టులు చూస్తూంటే.. అది అసలు ఆయన అకౌంటేనా.. ఆయన చదువుకి.. ఆయన పర్సనాలిటీకి.. ఆయన పదవికి.. ఆయన వయసుకి… సరిపడే ట్వీట్ ఒక్కటంటే ఒక్కటీ ఉండదు. ఎంపీ హోదాలో.. వెరీఫైడ్ అకౌంట్ పెట్టుకుని… ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేని సోషల్ మీడియా కార్యకర్తలు చేసే కామెంట్లు తరహాలో.. ఆయన ట్వీట్లు ఉంటాయి. దానికి ట్రోలింగ్స్ వచ్చినా ఆయన వెనుకడుగు వేయరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close