అసలు మహర్షి వర్క్ ఎంత బాకీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా విడుదల డేట్ మీద వార్తలు వచ్చాయి. ఏప్రియల్ 25న సినిమా విడుదల కాదని, కాస్త వారం వెనక్కు వెళ్తుందని వార్తలు వినిపించాయి. అసలు ఈ వార్తలు రావడానికి కారణాలు రెండు. ఒకటి శాసనసభ ఎన్నికలు ఆంధ్రలో ఏప్రియల్ 30న జరుగుతాయని వార్తలు వున్నాయి. కీలక ప్రచార సమయంలో మహర్షి విడుదల కావాల్సి వుంటుంది. రెండవది మహర్షి వర్క్.

ఎన్నికల టైమ్ లో సినిమా విడుదల పెద్ద ఇబ్బంది కాదు అనుకుంటే మహర్షి డేట్ మార్చాల్సిన పని లేదు. కానీ వర్క్ వరకు చూసుకంటే మాత్రం అవసరం అయితే మార్చాలి. వినిపిస్తున్న సమచారం ప్రకారం మార్చి 25నాటికి టాకీ మొత్తం అయిపోతుందని తెలుస్తోంది. అక్కడ రెండు మూడు పాటలు మాత్రం బకాయి వుంటాయి. వాటి షూట్ ఏప్రియల్ 1 నుంచి వుంటుంది. అంటే ఏప్రియల్ పది లోపు టోటల్ వర్క్ అయిపోతుంది.

ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్. పాటలు పూర్తయిన తరువాత పది రోజులు టైమ్ వుంటుంది. ఆ సంగతి అలా వుంచితే, డబ్బింగ్, ఎడిటింగ్, రీరికార్డింగ్ వంటివి సమాంతరంగానడుస్తుంటాయి. అందువల్ల మిగిలిన పనులకు, డీటీఎస మిక్సింగ్, తదితర వ్యవహారాలకు ఆ పది రోజులు సరిపోతాయి అనుకుంటే ముందుకు వెళ్తారు. ఎటొచ్చీ కాస్త పని వత్తిడి వుంటుంది.

మహేష్ ఎలాగైనా 25కే అని అంటే వంశీ పైడిపల్లి కాస్త చకచకా పని చేయాల్సి వుంటుంది. లేదూ వాయిదా అంటే కాస్త నెమ్మదిగా పని చేస్తే సరిపోతుంది. నిర్మాత దిల్ రాజు ఒపీనియన్ అయతే జస్ట్ వారం వెనక్కు వెళ్దామని అంటున్నట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close