విజయవాడ టిడిపిలో నిత్య పోటీ

అధినేతను మెప్పించడం కోసం అతిగా కీర్తించడం, అవతలివారిపై దాడి చేయడం టిడిపి నేతల నిత్య కృత్యాలుగా మారాయి. విభజన తర్వాత తెలంగాణలో బాగా వెనకపట్టు పట్టి విజయవాడ వీటికి కేంద్రంగా మారినట్టు కనిపిస్తుంది. రాజధాని రాజకీయ క్రీడలో ఎక్కడ వెనకబడిపోతామోనని దాదాపు అరడజను మంది నాయకులు అహౌరాత్రాలు పెనుగులాడుతున్నారట. బోండా ఉమామహేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్‌, వంశీ, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకరరావు వంటివారికి ఈ పెనుగులాటే సరిపోతున్నది.వీరందరి వీరోచిత విన్యాసాలలో ఒకోసారి ఒక్కొక్కరు బాగా స్కోరు చేశారనిపించుకోవడం, అంతలోనే ర్యాంకులు మారడం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. అవకాశం లేదా వివాదం వస్తే చాలు రంగంలోకి దిగిపోయి రాజకీయ దాడి చేయడమే వీరి ఫార్ములాగా మారింది. పాలక పక్షం ఇరకాటంలో వుంటే వీరి దాడి ఇంకా తీవ్రంగా వుంటుంది. గద్దె రామమోహనరావు మాత్రం ఈ పోటీలో అంతగా పాల్గొనరు. కేశినేని నానిది మరో స్టైల్‌. కొంతమంది గుంటూరు నేతలను కూడా ఈ జాబితాకు కలపాల్సి వుంటుంది. మంత్రులుగా వున్నా దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు కూడా ఈ రేసులో శక్తికొద్ది పాల్గొంటున్నారు. వీరంతా దశలవారిగా తిట్టిపోశాక అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు పెదవి విప్పుతారు. లేదంటే మీడియాలో తన వ్యాఖ్యలు వచ్చేలా చూసుకుంటారు. ఇంతలో మరో సమస్య మరో సంవాదం,, మరో సంఘర్షణ.. పైకి జరిగే సంఘర్షణ కంటే లోలోపల పార్టీలో జరిగేది మరింత తీవ్రంగా వుంటున్నట్టు వాపోతున్నారు. తప్పో ఒప్పో.. తప్పదు కదా…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close