వీఐపీ టిక్కెట్లు ఇక టీటీడీ బోర్డు సభ్యులకు మాత్రమే !?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అపర కుబేరులు కూడా వచ్చి చేరారు. పేరున్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కుబేరులనదగ్గ వారందరూ… శ్రీవారి సేవ కోసం అంటూ… బోర్డులో సభ్యత్వం పొందారు. వీరు ఎలా… శ్రీవారి సేవ చేయబోతున్నారో తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు. వీరందరికీ… టీటీడీ సభ్యుల కోటాలో… దర్శన టిక్కెట్లు లభించబోతున్నాయి. వాటిని… అస్మదీయులకు పంచడం ద్వారా.. పలుకుబడి పెంచుకుని.. శ్రీవారి సేవ చేయబోతున్నారు. తొలి టీటీడీ బోర్డు మీటింగ్ లోనే..ఇప్పటి వరకూ ఉన్న టిక్కెట్ల కోటాకు అదనంగా మంజూరు చేసుకోబోతున్నారు. అంటే… వీఐపీ టిక్కెట్లు ఇక టీటీడీ బోర్డు సభ్యులకు మాత్రమే అందుతాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా ఇక కష్టమేనంటున్నారు.

జెంబో పాలకమండలితో టీటీడీకి చాలా కష్టాలు ఎదురు కానున్నాయి. ఇప్పటి వరకూ టీటీడి చైర్మన్‌కు ప్రతీ రోజూ 200 నుంచి 300 బ్రేక్ దర్శన టిక్కెట్లు…. సభ్యులకు 35 వంతున టిక్కెట్లను జారీ చేస్తున్నారు. వీటికి అదనంగా చైర్మన్ కు 200, సభ్యులకు 35 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లతో పాటు పదుల సంఖ్యలో ఆర్జిత సేవా టిక్కెట్లను జారీచేస్తున్నారు. గతంలో చైర్మన్ తో పాటు పాలకమండలి సంఖ్య 18. ఇప్పుడు 29. వీరికి ప్రస్తుతం వున్న కోటా ప్రకారం టిక్కెట్లు జారీ చేస్తే ప్రస్తుతం టీటీడి కేటాయిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోటాలొ సగం పైగా వీరికే ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు గదులు కేటాయింపు కూడా అధికారులకు తీవ్ర తలనొప్పిగా మారనుంది. దీనికి తోడు 23న జరగనున్న పాలకమండలి మొదటి సమావేశంలో టిక్కెట్ల కోటా పెంచుకోబోతున్నారు కొత్త పాలక మండలి సభ్యులు.

ఇప్పటి వరకూ పాలకమండలికి కేటాయిస్తున్న కోటా కంటే అదనంగా కోటా ఇవ్వాలంటూ సభ్యులు ప్రతిపాదించి దానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పవు. పాలకమండలి కాకుండా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సిఫారస్సుతో వచ్చే వారికి కూడా టిక్కెట్లు ఉండవు. టీటీడీ పాలకమండలి శ్రీవారితో పాటు భక్తులకూ భారంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close