జగన్ రాజకీయ జీవితంపై ఉండవల్లి బెంగ !

రాష్ట్రం కోసం పోరాడనందునే గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు జగన్ అసలు పోరాడటం లేదని.. ఇప్పటికైనా కేంద్రంపై యుద్దం చేయకపోతే.. జగన్ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లేనని మాజీ ఎంపీ, జగన్ శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదనా స్వరంతో మీడియా ముందు వాపోయారు. దీనికి కారణం ఉండవల్లి దాఖలు చేసిన రాష్ట్ర విభజన వ్యతిరేక పిటిషన్ విచారణ అవసరం లేదని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడమే.

విభజన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. తెలంగాణ నుంచి ఏపీకి లక్ష కోట్లకుపైగా ఆస్తులు రావాల్సి ఉందని.. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీ నెరవేరలేదని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి.. పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సి.ఎం జగన్ కు భయం ఎందుకున్నారు. జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎ.పికి అన్యాయంపై సి.ఎం జగన్ పోరాటం చేయాలని.. పోరాటం చేయకుంటే జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని హెచ్చరించారు. ఎ.పి.కి అన్యాయంపై పోరాటం చేయకపోవడం చంద్రబాబుకు 23సీట్లు రావడానికి ఒక కారణమని తెలిపారు. మోదీ, జగన్ కు మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

కేంద్రంపై పోరాడితేనే జగన్ రాజకీయ భవిష్యత్‌కు పులిస్టాప్ పడుతుంది.. ఈ చిన్న లాజిక్‌ను ఉండవల్లి మిస్సయ్యారా లేకపోతే కేంద్రంపై పోరాటం ప్రారంభిస్తేనే ప్రజలు ఓట్లేస్తారని లేకపోతే వేయరనే సంకేతాన్ని జగన్‌కు పంపించారా అన్నది ఆయనకే తెలియాలి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్న కేసీఆర్ పరిస్థితి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే జగన్‌కు అయితే కొత్తగా కేసులు కూడా.. సోదాలు కూడా అవసరం లేదు. పాత కేసుల మీద విచారణ కొనసాగిస్తే చాలు. జగన్ రాజకీయ భవిష్యత్‌కు ముగింపు వచ్చినట్లే. అయినా ఉండవల్లి జగన్‌నురెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close