ఉండవల్లి ప్రెస్ మీట్ల అంతర్యం ఏమిటో?

రాష్ట్ర విభజన తరువాత హటాత్తుగా మాయమయిపోయిన అనేకమంది కాంగ్రెస్ నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు. మళ్ళీ ఆయన రాజకీయాలలో ఏక్టివ్ అవుతున్నట్లున్నారు. అందుకే ప్రత్యేక హోదా, భూసేకరణ తదితర అంశాల గురించి ప్రెస్ మీటలు పెట్టి మరీ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడిన తరువాత ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు. కానీ వైకాపాలోకి వెళ్ళే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన తెదేపా లేదా బీజేపీల వైపు చూస్తున్నట్లయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈవిధంగా విమర్శించేవారు. కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలనే ప్రెస్ మీట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నట్లుంది.

చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవబోతున్నరనే వార్త వెలువడగానే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోతే చంద్రబాబు నాయుడికి రాజకీయ భవిష్యత్ ఉండదని ఉండవల్లి జోస్యం చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించలేకపోవడంతో మోడీ ముందు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ప్రతిపాదన పెట్టారని అభిప్రాయపడ్డారు. ఓటుకి నోటు కేసులో తనను ప్రధాని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే మోడీని గట్టిగా నిలదీయలేకపోయారని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేసారు. కానీ ఈ కేసులో చంద్రబాబు నాయుడు ఇరుకొనే అవకాశం లేదు కనుక చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా నిలదీసి ఉండాల్సిందని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మోడీ ముందు తోకముడుచుకొని బయటకు వచ్చేసారని ఆక్షేపించారు. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అంతకంటే ఎక్కువే నిధులు మంజూరు చేస్తామని చెప్పడం పెళ్లి చేసుకోకుండా సంసారం చేయమన్నట్లుందని ఉండవల్లి ఎద్దేవా చేసారు. ఇద్దరు నాయుళ్ళు కేంద్రంతో కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారని విమర్శించారు. బీహార్ రాష్ట్రానికి రూ. 1.25 కోట్లు నిధులు మంజూరు చేయగా లేనిదీ ఏపీకి ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఉండవల్లి అడుగుతున్న ఈ ప్రశ్నలన్నీ సమంజసమయినవే. కానీ ఆయన వీటిని ఏదో ఒక రాజకీయ పార్టీ తరపున నిలబడి అడిగి ఉండి ఉంటే వాటికి ఒక విలువ ఉండేది. ఇదే అభిప్రాయాలను రాష్ర్టంలో ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు వారితో బాటు ఆయన కూడా చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండబోదు మీడియాలో కనబడటం తప్ప. ఉండవల్లి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇవ్వడం చూస్తుంటే, పవన్ కళ్యాణ్ భూసేకరణ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో చెప్పలేకపోయినా, ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ట్వీటర్ లో మెసేజులు పెడుతున్నట్లే ఉంది. ఒకవేళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఉండవల్లి భావించి, దాని గురించి గట్టిగా పోరాడలనుకొన్నట్లయితే ఈవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి తన వాగ్ధాటి ప్రదర్శించడం కంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరో లేక స్థాపించుకోనో దీనిపై పోరాడితే ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తారు. కేంద్రం కూడా దిగివస్తుంది. లేకుంటే ఆయన ప్రెస్ మీట్ల అంతర్యం ఏమిటని సందేహించవలసి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close