పట్టిసీమ వధ్యశిలగా మారుతుంది-చంద్రబాబుకు ఉండవల్లి వార్నింగ్

హైదరాబాద్: తాటిపూడి ప్రాజెక్ట్‌నుంచి పోలవరం కుడికాల్వకు నీళ్ళు పంపి పట్టిసీమనుంచి కృష్ణలోకి నీళ్ళు పంపినట్లు జనాన్ని ఎందుకు మభ్యపెడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ పదిశాతంకూడా పూర్తికాకుండానే జాతికి అంకితమివ్వటమేమిటని అన్నారు. అదికూడా తాత్కాలిక ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తారా అని ప్రశ్నించారు.  శాశ్వతంగా ఉండే ప్రాజెక్టును మాత్రమే జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఉండవల్లి ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఏదైనా ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు రావటం సహజమేగానీ, కేవలం ముడుపుల కోసమే చేపట్టిన ప్రాజెక్ట్ దేశంలో పట్టిసీమ ఒక్కటేనని అన్నారు. పట్టిసీమకు, రాయలసీమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పోలవరం కుడికాల్వకింద భూమిని నష్టపోయిన రైతులకు ఎకరాకు నలభై లక్షలవరకు ఇవ్వటం బాగానే ఉందని, తాటిపూడి, పోలవరం ప్రాజెక్టులకింద రైతులకుకూడా అలాగే ఇవ్వాలని సూచించారు. రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని చంద్రబాబు అంటున్నారని, అయితే సీమకు పప్పన్నంకాదు గన్నేరపప్పు పెడుతున్నారని విమర్శించారు. గోదావరి జలాలను విశాఖకుకూడా తీసుకొస్తానని చంద్రబాబు చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమరావతి అనేది చంద్రబాబు తన సొంత మనుషులకోసం 30వేల ఎకరాలలో కట్టుకుంటున్న ప్రాకారమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పట్టిసీమ వధ్యశిలగా మారుతుందని చంద్రబాబునాయుడును హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close