నీటి కటకట, విశ్వనగరం విలవిల

హైదరాబాద్ ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని పాలకులు డంబాలు పలకడం అటుంచితే, తాగడానికి, వాడుకోవటానికి నీటి సౌకర్యం సరిగ్గా లేక హైదరాబాద్ వాసులు విలవిలలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాటర్ ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతుంటే అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మీడియా ఏమో రాజకీయ వార్తల తోను, సంచలన వార్తల తోను బిజీగా ఉంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో నీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రతిరోజు రావలసిన మున్సిపల్ వాటర్ రోజు మార్చి రోజు కాదు కదా దాదాపు పది రోజులకు ఒకసారి రావడం కూడా గగనం అయిపోయింది. ఎండలు మండిపోవడం తో భూగర్భ జలాలు కూడా ఎండి పోయాయి. దీంతో గుక్క నీరు దొరక్క పూర్తిగా వాటర్ ట్యాంకర్ల మీద హైదరాబాద్ నగరం ఆధార పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేకించి నగరం లో ని శేర్లింగంపల్లి, కూకట్ పల్లి, రాజేంద్రనగర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాగడానికి వాడుకోవడానికి కూడా వాటర్ ట్యాంకర్ల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు హైదరాబాద్ వాసులకు ఏర్పడ్డాయి. దీని అదునుగా తీసుకుని వాటర్ ట్యాంకర్లు కూడా రేటు అమాంతం పెంచడంతో మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ప్రత్యేకించి ఘోరంగా ఉంది. సాధారణ సమయాల్లో 500 రూపాయల నుండి 800 రూపాయల మధ్యలో ఉండే ఒక వాటర్ ట్యాంక్ ధర ప్రస్తుతం 2,000 నుండి 3,000 మధ్యలో నడుస్తోంది. దీంతో నెలకు వేలకు వేలు కేవలం నీటికి చెల్లించాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు.

హైదరాబాద్ తో పోలిస్తే మరింత ఎక్కువగా నీటి ఎద్దడి ఉండాల్సిన నగరాలలో ప్రభుత్వ , అధికారులు చొరవ కారణంగా పరిస్థితి కాస్త నియంత్రణలో ఉండగా, హైదరాబాద్ లో మాత్రం అటు ప్రభుత్వం ఇటు అధికారులు చేతులు ఎత్తి వేసినట్లు గా కనిపిస్తోంది. తదుపరి వర్షం వస్తే తప్ప మున్సిపల్ వాటర్ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉండడం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం, అధికారులు ప్రదర్శించిన అలసత్వాన్ని సూచిస్తోంది. మహాప్రభో, విశ్వనగరం సంగతి తర్వాత ముందు మంచి నీళ్ళు, కరెంటు సక్రమంగా ఇవ్వండి చాలు అంటూ నగరవాసులు వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close