వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ చేయబోతున్నారా?

హైదరాబాద్: నిన్న, ఇవాళ విజయవాడలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానం రాకమానదు. తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో ఇన్నర్ రింగ్‌రోడ్‌కోసం అధికారులు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కటం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయటం, దానికి నిరసనగా వంశీ తన గన్‌మ్యాన్‌లను సరెండర్ చేయటం తెలిసిందే. రాష్ట్ర హోమ్ మంత్రి చినరాజప్ప వంశీ కేసుపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకు వెళుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, తప్పు చేసినట్లు విచారణలో తేలితే శిక్ష తప్పదని కూడా అన్నారు. సాధారణంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దానికి అర్థం పోలీసులు చర్యలు తీసుకోవటం ఖాయమని అందరకూ తెలిసిందే.

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఇళ్ళ తొలగింపు వివాదంపై శరవేగంగా స్పందించటం విశేషం. మామూలుగా రాష్ట్రస్థాయి పెద్ద వివాదాలకే జగన్ బాగా ముదిరిన తర్వాతగానీ వెళ్ళరు. మరి నిన్నటి స్థానిక వివాదానికి జగన్ స్పందించిన తీరు చూస్తే వంశీ ఆందోళనకు మద్దతుగా నిలబడటానికే అన్నట్లుగా కనబడుతోంది. వంశీ గతంలో జగన్ పార్టీలోకి జంప్ చేయాలని ఉవ్విళ్ళూరిన సంగతి తెలిసిందే. జగన్ ఒక సందర్భంలో విజయవాడ వచ్చినప్పుడు ఆయనను కలవటానికి బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సేపు వేచి చూసి మరీ వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు.

ఈ పరిణామంలో ఇంకో అవకాశంకూడా ఉంది. వంశీ వైసీపీలోకి వెళ్ళిపోతాడని తెలిసే ప్రభుత్వం అతనిపై కేసులు పెట్టి ఉండొచ్చు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇవాళ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని చెప్పిన వంశీ అలా చేయలేదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వంశీ ఇలా అధికారపార్టీలోనే విపక్ష సభ్యుడిలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన హోటల్ దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని బాజిది కావటం విశేషం. బాజి ప్రస్తుతం తెలుగుదేశంలోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close