అందుకే ఓటుకి నోటు కేసులో కదలిక వచ్చిందేమో?

అమరావతి శంఖుస్థాపన, ఆయుత చండీయాగం కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మళ్ళీ సఖ్యత ఏర్పడింది కనుక ఇక ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు అటకెక్కినట్లేనని అందరూ భావించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో దాని గురించి మీడియా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించినప్పుడు, “ఎన్నికల తరువాత దాని గురించి మాట్లాడుకొందాము,”అని సమాధానం చెప్పారు. దాని గురించి ఆయన మాట్లాడకపోయినా తెలంగాణా ఎసిబి అధికారులు ఆ కేసుని మళ్ళీ అటక మీద నుంచి దుమ్ము దులిపి క్రిందకు దించారు.

ఆ కేసులో నిందితుడిగా పేర్కొన్న జెరూసలెం మత్తయ్యకు పి.ఆర్.సి.సి.సెక్షన్ 160 క్రింద నిన్న నోటీసు జారీ చేశారు. వారం రోజులలోగా తమ ముందు విచారణకు హాజరు కావలసిందిగా కోరారు. ఈసారి అతను తన లాయర్ ని వెంట తెచ్చుకోవడానికి అనుమతిచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్ట్ చేయబోమని కూడా తెలియజేసారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడానికే పిలుస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు తను తెలంగాణాలో తెలుగు దేశం పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొంటానని, తెలంగాణాని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పదేపదే చెప్పారు. బహుశః ఆ కారణంగానే మళ్ళీ ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చిందేమో? కనుక రేవంత్ రెడ్డి కొంచెం వెనక్కి తగ్గి, చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు, పార్టీకి దూరంగా ఉండేందుకు సిద్దపడినట్లయితే, జమ్మి చెట్టు మీద పాండవుల అస్త్రాలు దాచుకొన్నట్లుగా ఓటుకి నోటు కేసు కూడా ఎసిబి ఆటక మీద భద్రంగా ఉంటుందని భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close