అమలాపురంలో ఏమీ జరగలేదనుకుంటున్న వైసీపీ !

దృశ్యం సినిమాను ఫాలో అవుతున్నారు వైసీపీ పెద్దలు. అమలాపురంలో అంత విధ్వంసం జరిగి.. మంత్రి, ఎమ్మెల్యే ఇంటిని తగలబెడితే కనీసం పట్టించుకోవడం లేదు. అమలాపురంలో ఇంటర్నెట్ ఆపేసి.. అక్కడి సమాచారం పెద్దగా బయటకు రాకుండా చేసేసి అంతా కామ్‌గా ఉండిపోతున్నారు. అక్కడేమీ జరగలేదు… ఏమీ చేయలేదు.. ఏమీ జరగనట్లే ఉండండి అన్నట్లుగాఉండిపోతున్నారు. నిందితుల్ని… ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు కానీసం బాధితుల్ని కూడా ఎవరూ పరామర్శించడం లేదు.

దళిత మంత్రి ఇంటిని తగలబెడితే ఆయనను పలకరించేవారు లేరు. ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేస్తే ఆయనను పట్టించుకున్న వారు లేరు. సాధారణం ఓ మంత్రి కారుపై చిన్న రాయి పడినా .. ఆయనకు జరిగే పరామర్శలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడేందో విచిత్రంగా విశ్వరూప్ ఇంటిని తగలబెట్టినా సొంత పార్టీ నేతలు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. కనీస ఓదార్పు లేదు. తన టీంలోని మెంబర్‌పై దాడి జరిగితే… జగన్ కనీసం కన్సర్న్ కూడా చేయలేదు. దాడి జరిగినప్పుడు విదేశాల్లో ఉన్నారు. అప్పుడు పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందన్న వివరాలుతెలుసుకుని ఓదార్పు ఇవ్వలేదు.

పోలీసుల వ్యవహారం కూడా అంతే ఉంది. పాలరాజు అనే అధికారికి మొత్తం అప్పగించి డీజీపీ మాత్రం రిలాక్స్ అవుతున్నారు. గొడవలు జరిగిన తర్వాత రోజు ప్రశాంతంగా తిరుమల దర్శనం చేసుకుని అక్కడ మీడియా ఎదురు పడితే మాట్లాడటం తప్ప.. తర్వాత ఏం జరిగిందన్నది కూడా చెప్పడం లేదు. ఆయన అమలాపురంలో పర్యటించలేదు. మంత్రిపై దాడి జరిగితే.. డీజీపీ పట్టించుకోకపోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. కొత్త డీజీపీ తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఏ ఒక్కర్నీ కలవడం లేదు. వినతి పత్రాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. శాంతిభద్రతలపై మాట్లాడుతున్నదీ తక్కువే.

అమలాపురం వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ నేతలే అన్న విషయాలు అందరికీ అర్థమయ్యాయి. అందుకే .. అక్కడ ఏమీ జరగలేదన్న భావనతో ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : డ్రగ్స్ క్యాపిటల్ గా మారిన రాష్ట్రం గురించి ఆలోచించండి !

గంజాయి మత్తులో దాడులు... గంజాయిత మత్తులో హత్యలు.. గంజాయి మత్తులో అత్యాచారాలు.. గంజాయి గ్యాంగుల హల్ చల్. ఇవి వార్తలు మాత్రమే కాదు.. ప్రతీ రోజూ.. ఏపీలో దాదాపుగా ప్రతీ వీధిలో...

ఈనాడు ఇంటర్యూ : ఏపీ వికాసానికి మోదీ గ్యారంటీ

ఎన్నికల సందర్భంగా ఈనాడు పత్రికకు ప్రధాని మోదీ ఇంటర్యూ ఇచ్చారు . ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఇంటర్యూను ఈనాడు ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ ఇంటర్యూలో...

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close