అరవై రోజుల్లో కావాల్సినంత ఇసుక..! జగన్ కొత్త గడువు..!

ఇసుక సమస్య పరిష్కారానికి మరో అరవై రోజుల గడువు పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి నాలుగు నెలలు గడిచాయి. మూడు నెలల పాటు అసలు ఇసుక దొరకకుండా బ్యాన్ చేశారు. గత నెల ఐదో తేదీన కొత్త పాలసీ ప్రకటించారు. అయినా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో మళ్లీ మరో అరవై రోజుల్లో సమస్యను పరిష్కరించాలంటూ ఆధికారులకు ఆదేశాలిచ్చారు. కొత్త పాలసీ వచ్చాక కూడా ఇసుక కొరత తలెత్తుతుండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకు వాహనాల యజమానులు ముందుకు రావడం లేదని అధికారులు చెప్పడంతో.. జిల్లాలో రెండు వేల మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ యువకులకు రుణాలిచ్చి.. వాహనాలు కొనిపించాలనిసూచించారు. వారిని ఇసుక రవాణాకు ఉపయోగించుకోవాలని సూచించారు.

ఎక్కడా ఇసుక మాఫీయా అనే పేరే వినిపించకూడదని ఆయన అధికారులకు సూచించారు. ఏపీ ప్రజలకు సరిపోయేంత ఇసుక లేదని.. అందుకే ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా జరగకూడదని స్పష్టం చేశారు. ఇసుక కొరత ఎందుకు ఎర్పడిందనే అంశంపై అధికారులు ఒక్క వరదనే కారణంగా చూపిస్తున్నారు. అయితే.. బ్లాక్ మార్కెట్‌లో విరివిగా దొరుకుతూండటం ప్రజల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. వైసీపీ నేతలే ఎక్కువగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిలో ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక కావాల్సిన వారు.. వైసీపీ నేతలను సంప్రదించాల్సి వస్తోంది. టీడీపీ హయాంలో.. ట్రాక్టర్ ఇసుక మూడు, నాలుగు వేలకే దొరికేది. అప్పట్లో వైసీపీ నేతలు ఇసుక మాఫియా అనేవారు.

ఇప్పుడు.. ట్రాక్టర్ ఎనిమిది వేలకు ప్రజలకు దొరుకుతోంది. ఇప్పుడేమనాలని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక వ్యవహారం.. లక్షల మందిపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తూండటంతో.. పరిష్కారం చూపాలని.. ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తున్నారు. కాని ఇసుక పాలసీలోని లోపాలు… పర్యవేక్షణా లోపంతో… ఇసుక మొత్తం బ్లాక్ మార్కెటర్ల పాలయిందనే విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

సజ్జలపై క్రిమినల్ కేసు… పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడిది..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు...

సినిమా థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్

అవును... మీరు చ‌దివింది నిజ‌మే. మూవీ థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌డ‌తారా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close