“కియా”ను ప్రారంభించబోతున్న జగన్..!

నిజమే…! కియా పరిశ్రమను జగన్ ప్రారంభించబోతున్నారు..! అదేంటి… ఆ పరిశ్రమ ఎప్పుడో ప్రారంభమైంది కదా.. కియా కార్లు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి కదా.. అనే డౌట్ వస్తే… దాన్ని డౌట్‌లాగే ఉంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వ లెక్క ప్రకారం.. కియా ప్లాంట్‌ను..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించక ముందు..సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీకి తీసుకు వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత  ఆ పరిశ్రమ వెనక్కి తగ్గింది. తర్వాత వైఎస్ కుమారుడు.. సీఎం అయ్యే చాన్స్ ఉందన్న ఉద్దేశంతో… మళ్లీ పరిశ్రమ ఏపీకి వచ్చింది. ఆయన కుమారుడు సీఎం అయి.. ఆరు నెలల్లోగా ఉత్పత్తి ప్రారంభించేలా.. కంపెనీని సిద్ధం చేశారు. ఇప్పుడు ప్లాంట్ సిద్ధమయింది. దాన్ని వైఎస్ కుమారుడు జగన్ సీఎం హోదాలో ప్రారంభించబోతున్నారు. ఈ ముహుర్తాన్ని గురువారం ఖరారు చేసుకున్నారు. గురువారం అనంతపురం కియా ప్లాంట్‌ను.. జగన్ ప్రారంభించి.. కార్లను విడుదల చేస్తారు.
 
కియా పరిశ్రమ చుట్టూ.. వైసీపీ చేసిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. కియా పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వివిధ అంశాలపై ఒత్తిడి తెచ్చిందని ప్రచారం జరిగింది. ఈ కారణంతో.. విడిభాగాల పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే తగ్గట్లుగానే… గతంలో..ఏపీ సర్కార్‌కు ప్రతిపాదనలు సమర్పించిన కంపెనీలేవీ.. అనంతపురంలో పనులు ప్రారంభించలేదు. గతంలో కారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో… హిందుపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్… కియా యాజమాన్యంతో దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ఆ తర్వాత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కియా యాజమాన్యం నుంచి.. “హైలీ రెస్పెక్టెడ్ సర్‌నేమ్‌” అని సంబోధించుకుంటూ ఓ లేఖ తీసుకొచ్చి.. అసెంబ్లీలో వినిపించారు. అది సోషల్ మీడియాలో… కామెడీకి కేరాఫ్ అయిపోయింది.

ఆరు నెలల్లో ఒక్క పరిశ్రమను కూడా… జగన్మోహన్ రెడ్డి ఏపీకి తీసుకురాలేకపోయారు. కొన్ని పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది కానీ..  ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ.. చంద్రబాబు హయాంలో.. ఏపీలో పెట్టుబడులు వచ్చిన దిగ్గజ కంపెనీలన్నీ వెనక్కి పోయాయి. ఈ విషయంపై.. ప్రభుత్వం.. ఎదురుదాడికి దిగుతోంది. తమ విధానాలు నచ్చితేనే వస్తారని లేకపోతే.. అవసరం లేదని వాదిస్తోంది. దీంతో..  ప్రారంభమైన ప్లాంట్లనే.. జగన్ మరోసారి ప్రారంభించాల్సి వస్తోంది.
 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close