అనంతపురం నేతల మధ్యా పంచాయతీ చేయక తప్పదా..?

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదాన్ని .. ఆ పార్టీ నాయకత్వం అతి కష్టం మీద సర్దుబాటు చేసింది. కోటంరెడ్డిని కొన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండమని సూచించి.. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగేలా చేసింది. అయితే.. ఈ లోపే… కొత్తగా అనంతపురంలోనూ.. నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హంగామా సృష్టించారు. ముఖ్యమంత్రి పర్యటనలో.. ఎక్కడా తన పేరు లేదని.. కనీసం ఆహ్వానించే వారి జాబితాలోనూ తన పేరు చేర్చలేదని.. జిల్లా మంత్రి శంకర్ నారాయణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర నేతలు నేతలు సర్దిచెప్పి.. పక్కకు తీసుకెళ్లారు.

అనంతపురం జిల్లా వైసీపీ నేతల మధ్య… పొసగని పరిస్థితి ఉంది. హిందూపురం, ఉరవకొండ మినహా.. అన్ని నియోజవర్గాల్లోనూ వైసీపీ నేతలే గెలిచారు. దాంతో.. వైసీపీలో నేతలెక్కువైపోయారు. పెత్తనం చేయాలనుకునేవాళ్లు కూడా.. పెరిగిపోయారు. దీంతో.. వైసీపీలో… రచ్చ ప్రారంభమయింది. ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే.. మరో నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో సమస్య వస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిజానికి శింగనమల నియోజకవర్గానికి చెందిన వారు. అలా… తమ తమ నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు చేయాలనుకోవడంతోనే సమస్య ప్రారంభమవుతోంది. తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనుకునేవారి సంఖ్య పెరగడంతో… గొడవలు ప్రారంభమవుతున్నాయి.

ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. దాంతో… ప్రభుత్వంలో తమదే పైయి అంటే.. తమదే పైచేయి అని… ప్రతీ చోటా రెండు వర్గాలు తయారయ్యాయి. జిల్లా మంత్రులుగా ఎవరున్నప్పటికి.. తమకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని.. తాము చెప్పిన మాటే వినాలని.. కొంత మంది జిల్లాల్లో పెత్తనం చేయడం ప్రారంభించారు. వీరికి మంత్రులు, ఇతర పదవులు పొందిన వారు అడ్డం పడుతున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాలు… వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు నెల్లూరు తర్వాత అనంత నేతల మధ్య కూడా… వైసీపీ పెద్దలు పంచాయతీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close