జిల్లాల ఉద్యమంతో వైసీపీ నేతల అంతర్గత రాజకీయాలు !

వైసీపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోంది. అయితే ప్రతీ జిల్లాలో ఏదో ఓ డిమాండ్ వస్తోంది. అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదే. అయితే ఇది ప్రజల నుంచి వస్తుందని చెప్పుకోవడం కన్నా ఎక్కువగా వైసీపీ వర్గాల నుంచే వస్తోంది. వైసీపీ నేతలే ఈ డిమాండ్లు చేస్తున్నారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లో తమ బల ప్రదర్శన చేసుకోవడం కోసం ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కడప జిల్లా రాజంపేటలో వైసీపీ వర్గాల మధ్య రచ్చ రచ్చ జరుగుతోంది. ఇక చిత్తూరు జిల్లాలో మదనపల్లి, నగరి, బాలాజీ జిల్లా ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి నియోజవకర్గంలో వైసీపీ నేతలు సీఎంను కలుస్తామంటున్నారు. రోజా కూడా తిరుపతికి సమీపంలో ఉన్న నగరిని బాలాజీ జిల్లాలోనే ఉంచారని డిమాండ్ చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో ఆనం అయితే వైసీపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నారు. ఆయనది కూడా తనను పట్టించుకోవడం లేదనే బాధేనని వైసీపీ వర్గాలకు తెలుసు. ఇలా ప్రతి జిల్లాలోనూ రచ్చ అవుతోంది.

ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్న వైసీపీ నేతలను ఎక్కడిక్కకడ బుజ్జగించేందుకు వైసీపీ హైకమాండ్ జిల్లాల వారీగా కొంత మందికి బాధ్యతలు ఇచ్చింది. చాలా వరకూ కూల్ చేస్తున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ ఉన్న హిందూపురం వంటి చోట్ల వైసీపీ నేతలు ఆందోళనలు చేసుకోవడానికి హైకమాండే పర్మిషన్ ఇస్తోంది. ఎక్కువ చోట్ల మాత్రం తమ బలం హైకమాండ్‌కు ప్రదర్శించడానికి ఈ వివాదాన్ని నేతలు పెద్దవి చేస్తున్నారు.

ఈ జిల్లాల ఆందోళనలను వ్యూహాత్మకంగా సద్దుమణిగేలా చేయకపోతే రేపు తుది నోటిఫికేషన్ తర్వాత సమస్యలు వస్తాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వీటిని వీలైనంత త్వరగా సర్దుబాటు చేయాలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close