భూమి గుండ్రంగా ఉంటుంది.. కన్నుమిన్నూ కానరాకుండా నువ్ ఏది చేస్తే అది నీకు రివర్స్ వస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఇప్పుడు వైసీపీ నేతలకు అది బాగా అర్థమైపోతుంది. ముఖం ఎర్రగా.. కందగడ్డగా మార్చుకుని మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి తర్వాత అయినా సిగ్గుపడి ఉంటాడు. తాము చేసింది ఇప్పుడు రివర్స్ లో జరుగుతోందని ఆయనకు అర్థమైపోయింది ఉంటుంది. బహిరంగసభల వద్ద పవన్, చంద్రబాబు కటౌట్లు పెట్టించి… గంజాయి, తాగుబోతు బ్యాచ్లతో వాటిని కొట్టిన నీచ చరిత్ర గుర్తుకు వచ్చి ఉంటుంది. తమ ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళలు ఫోటోల్ని చెప్పుతో కొట్టడం ప్రశ్నిస్తే తాము చేసిన నిర్వాకం బయటకు వస్తుందని తెలిసినా ఆయన ఆపులేకపోయారు. ఇది ఒక్కటేకాదు.. జరుగుతున్న ప్రతి ఘటనకు వైసీపీ హయాంలో జరిగినవి గుర్తుకు వస్తున్నాయి. అందుకే ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతి వ్యక్తం చేయడం లేదు.
ప్రతీ దానికి అప్పట్లో చేసిన అరెస్టులే కనిపిస్తున్నాయి !
జగన్ రెడ్డి హయాంలో.. తన చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి దానితో అరాచకాలు చేస్తానని అనుకునేవారు. చేసేవారు. ఎవర్నీ వదిలేవారు కాదు. ఇప్పుడు ఆయన వికృతానికి బలైన వాళ్లంతా కేసుల పాలవుతున్నారు. ఇప్పుడు వికృతం చూపించాలనుకున్న వారికీ శంకరగిరి మాన్యాలు తప్పడంలేదు. అరెస్టులు తప్పు అని చెప్పేందుకు జగన్ రెడ్డి .. వైసీపీ నేతలు ఆవేశపడిపోతున్నారు. మీరు చేసింది ఏంటయ్యా.. అనే ప్రశ్న అందరి కంటే ముందు వస్తోంది. రంగనాయకమ్మ కానీ.. జర్నలిస్ట్ అంకబాబు కానీ ఎవర్నీ కించపర్చలేదు. కేవలం సోషల్ మీడియా పోస్టులు ఫార్వార్డ్ చేశారు. అదే తప్పన్నట్లుగా కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు ఓ ప్రాంత మహిళలందర్నీ కించ పరిచినందుకు కొమ్మినేని అరెస్టు చేశారు. అరెస్టు అక్రమం అని ఏ నోటితో చెప్పగలరు ?
అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానరాకపోతే ఇదే పరిస్థితి!
ప్రజలు బంపర్ మెజార్టీతో అధికారం ఇచ్చారంటే.. తమను దోచుకోమని.. రాజకీయ ప్రత్యర్థులను వేధించమని.. చంపమని కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లిన వారిని అరెస్టు చేయడం.. అర్థరాత్రిళ్లు తలుపులు పగులగొట్టడం వంటివి చేసి మానసిక వికృతం తీర్చుకోమని కాదు. కానీ ఐదు సంవత్సరాల పాటు అదే చేశారు. చివరికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్ రెడ్డికి నిద్ర రావడం లేదు. అర్థరాత్రి పూట ట్వీట్లు పెట్టాల్సి వస్తోంది. తనదాకా వస్తారని ఆయన ఉలిక్కి పడుతున్నారు. రాకపోవడానికి ఎలాంటి కారణం లేదు. సమయం రావాలి అంతే.
రాజకీయ పార్టీలకు గుణపాఠం – వైసీపీ దుస్థితి!
అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నా… ఒక్కరంటే ఒక్కరు కూడా.. ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పడం లేదు. ఒక్కరి విషయంలోనూ ప్రజల నుంచి సానుభూతి రావడం లేదు. ఎందుకంటే.. వారు అంత ఘోరాలు చేశారు మరి. ప్రజలు కూడా అలా జరగాల్సిందే అనుకుంటున్నారంటే.. వారి వ్యవహారంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారం ఉందని మిడిమాలపడే వారికి వైసీపీ దుస్థితి ఓ హెచ్చరిక లాంటిది.. గుణపాఠం లాంటిది. మేము వస్తే అది చేస్తాం..ఇది చేస్తాం అని బెదిరించినంత మాత్రాన వ్యవస్థలు ఆగిపోవు.. జరగాల్సినవి జరిగిపోతాయి.