మీ అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది : సౌఖ్యం ఆడియోలో గోపీచంద్

ఎంత పెద్ద స్టార్ అయినా సరే తన గొప్పతనం ఏంటో తను పుట్టి పరిగిన ఊరికి చూపించాలనుకుంటాడు ఆ దారిలోనే యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తను చేస్తున్న సౌఖ్యం సినిమా ఆడియోని ఒంగోలులో విడుదల చేశాడు. సినిమాలో పనిచేసిన చిత్ర యూనిట్, నటీనటులంతా ఒంగోలులో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చారు. ముందుగా 1000 సినిమాలకు పైగా తన కత్తెర వాడి గిన్నిస్ బుక్ రికార్డుని కూడా సొంతం చేసుకున్న ప్రముఖ ఎడిటర్ గౌతం రాజుకి సన్మాన కార్యక్రం జరిపారు సౌఖ్యం చిత్ర యూనిట్. అనంతరం నిన్న పుట్టినరోజు జరుపుకున్న హీరోయిన్ రెజినా చేత కూడా పుట్టినరోజు కేక్ కట్ చేయించారు.

ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ముందుగా తనను హీరోగా చేసిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారిని తలచుకుని మొదలెట్టిన గోపీచంద్ ప్రసంగం అభిమానులను ఉద్దేశించి కూడా మాట్లాడి ఆకట్టుకునేలా చేసింది. తనని ఇంతవాడిని చేసిని కేవలం మీ అభిమానమే అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన గోపీచంద్ తన సినిమా ఆడియో కోసం ఇంతసేపు కదలకుండా ఉన్నందుకు వారందరికి ధన్యవాదానాలు తెలిపాడు.

తనకు యజ్ఞం లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు రవికుమార్ ఈ సినిమాను కూడా బాగా తీశాడని.. ఇక భవ్య ఆనంద్ ప్రసాద్ గారు తనకు మంచి మిత్రుడని.. భవ్య క్రియేషన్స్ సినిమా అంటే తన సొంత బ్యానర్ లో సినిమా చేస్తున్నంత స్వేచ్చ ఉంటుందని అన్నాడు గోపీచంద్. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క నటీనటులకు, సాంకేతిక నిపుణలకు తను థాంక్స్ చెబుతూ ప్రసంగాన్ని ముగించాడు. సినిమా బాగా వచ్చిందని సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చెప్పారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో ఈ నెల 25న తెలిసిపోతుంది లేండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close