`బుల్ రేస్ హామీ’తో మంత్రికి కష్టాలు !

ఎడ్ల పందాలు, జల్లికట్టు, కంబాలా వంటి ఎద్దులతో సాగించే క్రీడల విషయంలో కేంద్ర పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆ మధ్య ఇచ్చిన హామీని ఆయనే నిలబెట్టుకోలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలుచోట్ల బుల్ రేస్ నిర్వహణకు సమయం దగ్గర పడటంతో ఇప్పుడీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

లూథియానాకు దగ్గర్లో నిర్వహించే `కిలా రాయిపూర్ గేమ్స్’లో భాగంగానే ఎడ్ల బండ్ల పోటీలు జరుగుతుంటాయి. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జల్లికట్టు (పొగరబోతు ఎద్దులను లొగదీసుకునే ఆట) కంబాలా (కాడెద్దుల పోటీ) ఇంకా బండ లాగుడు పోటీల వంటివి కనీసం ఎడాదికొకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వచ్చే నెల (ఫిబ్రవరి) 4 నుంచి 7 వరకు కిలా రాయిపూర్ గేమ్స్ లో భాగంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడం లూథియానాలో ఒక ఆచారమైపోయింది. ఎద్దులతో సాగించే ఆటల పేర్లు వేరువేరుగా ఉన్నప్పటికీ దేశమంతటా ఇలాంటి క్రూర క్రీడలు చట్టవిరుద్ధంగా సాగిస్తూనే ఉన్నారు. ఈ రకరకాల పోటీల్లో మూగజీవాలను హింసిస్తూ తాము ఆనందం పొందే లక్ష్యంతోనే సాగుతుంటాయని అందువల్ల ఇలాంటి ఎద్దుల పోటీలను లేదా క్రీడలను నిర్వహించకూడదని చాలా కాలంగా జంతు సంక్షేమ సంస్థ (యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా – AWBI) చెబుతోంది. అంతేకాదు, ఎడ్ల పందాలమీద గతంలో సుప్రీంకోర్టు 2014లో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే, ఇవేవీ మంత్రిగారికి ఈ తెలిసినట్లు లేవు. బుల్ రేస్ వంటి ఎద్దుల పోటీలను హాయిగా జరుపుకోవచ్చంటూ గట్టి హామీ ఇచ్చేశారు.

మంత్రివర్యులిచ్చిన హామీతో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ కంగుతింది. అటు చూస్తే మంత్రిగారిచ్చిన హామీ, ఇటు చూస్తే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అందుకే ఈ వ్యవహారం ముదరకముందే సున్నితంగా పరిష్కరించాలని అనుకుంది. మంత్రిగారికి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ, హామీని అమలుచేస్తే ఎంతటి ఇబ్బంది కలుగుతుందో సవివరంగా చెప్పింది.

కేంద్ర మంత్రి జవదేకర్ ఇలా హామీ ఇవ్వగానే అలా విమర్శలు పుట్టుకొచ్చాయి. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వెంటనే స్పందిస్తూ, మంత్రిగారిచ్చిన హామీ గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి వ్యతిరేకమని, మంత్రి తన తప్పుతెలుసుకుని హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ గండం గట్టెక్కించేందుకు యానిమల్ బోర్డ్ కి చెందిన లీగల్ సబ్ కమిటీ మేల్కొని మంత్రివర్యులకు సలహా పత్రం తయారుచేసింది. జల్లీకట్టు, కంబాలా, ఎడ్లబండ్ల పోటీ వంటివాటిని నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందనీ, అలాంటివి నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందనీ, అక్రమంగా నిర్వహించడం, వాటిని ప్రోత్సహించడం నేరమే అవుతుందన్న వాస్తవ విషయాలను మంత్రివర్యులకు సదరు బోర్డ్ చెప్పాల్సివచ్చింది. `అయ్యా, ఈ కారణాల వల్ల తమరు ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలి. అలాంటి ఎడ్ల పోటీలను ఏ రకంగానూ నిర్వహించడం, లేదా ప్రోత్సహించడం కూడా నేరమే అవుతుంది సుమీ.. ‘ అంటూ బోర్డ్ మంత్రివర్యులకు ఎరుకపరచింది.

మూగజీవాలను హింసిస్తూ ఆనందించే ప్రవృత్తితో కూడిన ఆటలను ప్రోత్సాహించాలనుకోవడం నిజానికి సిగ్గుచేటు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి ఎలా హామీలు గుప్పించారో తెలియడంలేదని జంతుప్రేమికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే బుల్ ఫైటింగ్ వంటి క్రూరత్వ క్రీడలను బ్యాన్ చేశాయి. కొలంబియా, ఈక్వడర్, ప్రాన్స్, పోర్చుగల్, వెనెజులా దేశాలు తాము బుల్ ఫైటింగ్ కు వ్యతిరేకమని తేల్చిచెప్పాయి.

మూగజీవాలతో సాగించే క్రీడల విషయంలో న్యాయస్థానం ఇదివరలో ఇచ్చిన ఆదేశాల మేరకు జంతువుల పరిరక్షణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను తిరగరాయాలంటే, యానిమల్ బోర్డ్ ను విధిగా సంప్రదించాల్సిందే. అవేవీ జరగకుండా మంత్రిగారుకానీ, లేదా మంత్రిత్వశాఖ గానీ ఎడ్ల పందాలు నిర్వహించుకోవచ్చంటూ అధికారికంగా నోటీసులు జారీ చేయకూడదు. ఈ విషయాలేవీ తెలియకుండానే కేంద్ర మంత్రి జవదేకర్ ఎడ్ల పోటీలకు సంబంధించి హామీ ఇవ్వడంతోపాటుగా ఉత్తర్వు తయారుచేయమంటూ అధికారులను ఆదేశించడం ఆశ్చర్యమే.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close