రిజర్వేషన్‌ స్టోరీలో మరో ట్విస్ట్‌ !?

కాపులకు అయిదు శాతం రిజర్వేషన్‌ కోసం కేంద్రానికి రాయాలని ఎపి శాసనసభ తీర్మానం చేయడం వెనక పెద్ద వ్యూహమే వుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి ప్రయోజనం ముద్రగడ పద్మనాభం శిబిరాన్ని నిరాయుధం చేయొచ్చు. ఎంతో కొంత ఇస్తామంటున్నారు గదా అన్న భావన వస్తే వారి ఆందోళన పదును తగ్గుతుంది. ముద్రగడ కూడా కొంతవరకూ సంతోషమేనని అనడమే అందుకు సంకేతం. మొదటి అడుగు పడిందనీ, భోజనం పెడతానని టిఫిన్‌ పెట్టారని కూడా వ్యాఖ్యానించారు. ఎంతో కొంత చేశారనే అర్థం ఈ మాటల్లో ధ్వనిస్తుంది.ఇక వైసీపీ నాయకుడు కాపు ప్రముఖుడు అంబటి రాంబాబు మంజునాథ కమిషన్‌ నివేదిక రాకుండా ఇవ్వడం వల్ల ఇది కోర్టులో నిలవదనే వాదనతో వ్యతిరేకత ప్రకటించారు. అయితే మెజార్టి సభ్యుల నివేదికలు వచ్చాయని వాదించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక మంజునాథ ఒక్కరే ఎందుకు ఇవ్వలేదు?అందరికీ న్యాయం జరిగేట్టు తన నివేదిక వుంటుందని ఆయన అనడంలో అర్థమేమిటి? బహుశా అగ్రవర్ణపేదలకు కూడా ఆయన రిజర్వేషన్‌ సిఫార్సు చేసి వుండొచ్చని రాజకీయ వర్గాలు వూహిస్తున్నాయి. ఆయన ఇచ్చాక ప్రభుత్వం దాన్ని కూడా అధ్యయనం చేస్తానని ప్రకటిస్తే ఇతర తరగతులకూ తాయిలం ఆశచూపినట్టు అవుతుంది. కాబట్టి రిజర్వేషన్‌ కథలో ఇంకా చాలా ట్విస్టులుంటాయి. బిసిలు కాపుల మధ్య పెద్ద ఘర్సణగా మారే అవకాశం మాత్రం వుండకపోవచ్చు. అలాటి ప్రయత్నాలు విఫలమైనాకే ప్రభుత్వం ఈ ప్రకటనచేసింది. ఈ క్రమంలో ఆర్‌.కృష్ణయ్యతో పాటు మరికొందరు బిసి నేతలు కూడా విమర్శలు మూటకట్టుకోవచ్చు. కృష్ణయ్య టిడిపినుంచి తప్కుకోవడానికి ఒక సాకు కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close