కైరానా ఫలితంపై అమిత్ షా ఇప్పుడేం చెప్తారో..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌రోసారి దెబ్బ‌ప‌డింది. కైరానా ఎంపీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో భంగ‌పాటు త‌ప్ప‌లేదు. స‌రిగ్గా, రెండు నెల‌ల కింద‌ట‌.. అంటే మార్చిలో కూడా భాజ‌పా కంచుకోట అనుకున్న యూపీలో ఫుల్ పూర్‌, గోర‌ఖ్ పూర్ ఎంపీ స్థానాల‌కు కూడా ఉప ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి స్థానాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భాజ‌పాకి ఓట‌మి త‌ప్ప‌లేదు. అయితే, ఆనాటి ఓట‌మిపై భాజ‌పా త‌క్ష‌ణ స్పంద‌న ఏంటంటే… యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ వైపు భాజపా పెద్దలంతా వేలు చూపారు! ఆయ‌న అతి విశ్వాసంతో వ్య‌వ‌హ‌రించార‌నీ అందుకే ఓట‌మి త‌ప్ప‌లేద‌న్నారు.

చివ‌రి నిమిషంలో ఎస్పీ బీఎస్పీలు ఏక‌మౌతాయ‌ని ఊహించ‌లేక‌పోయామ‌నీ, వారి కూట‌మికి ధీటుగా రియాక్ట్ అయ్యేందుకు భాజ‌పా ద‌గ్గ‌ర స‌మ‌యం లేక‌పోయింద‌నీ విశ్లేషించుకున్నారు. ఇక‌, భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా అయితే… ఉప ఎన్నిక‌లు అనేవి స్థానిక అంశాల ప్ర‌భావంతో జ‌రుగుతాయ‌నీ, ఉప ఎన్నిక ద్వారా ప్ర‌భుత్వాలు కొత్త‌గా ఏర్ప‌డ‌వు అని ఓట‌ర్లుకు తెలుస‌నీ, అందుకే ఆ ఫ‌లితాల‌ను మోడీ నాయ‌క‌త్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూడకూడదన్నారు. యూపీలో జ‌రిగిన నాటి రెండు స్థానాల ఎన్నిక‌లూ 2019లో మోడీ నాయ‌క‌త్వం ప్రాతిప‌దిక‌న జ‌రిగిన‌వి కావ‌ని కొట్టిపారేశారు.

స‌రే, ఇప్పుడు అమిత్ షా ఏమంటారు మ‌రి..? కైరానాలో కూడా భాజ‌పా ఓడిపోయింది. ఈ ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీలు క‌లిసి పోటీకి దిగుతాయ‌ని ముందే తెలుసు క‌దా! ఇదేమీ అనూహ్య క‌లయిక కాదు. కైరానా ఎన్నిక విష‌యంలో యోగీ ఆదిత్య‌నాథ్ బాగానే జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చారు. అతి విశ్వాసానికి వెళ్లలేదు. చివ‌రికి, ప్ర‌ధాని కూడా కైరానా చెరుకు రైతుల్ని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేశారు. అయినాస‌రే ఓట‌మి త‌ప్ప‌లేదే..! ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేవ‌లం స్థానిక అంశాల‌నే దృష్టిలో పెట్టుకుని, మోడీ పాల‌న గురించి ఆలోచించ‌కుండా ఓటింగ్ కి వెళ్లారా..? ఈ ఫ‌లితాన్ని అమిత్ షా ఎలా విశ్లేషిస్తారో చూడాలి.

ఇంకోటి, ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త అన్నిసార్లూ సాధ్యం కాద‌నీ ఈ మ‌ధ్య‌నే అమిత్ షా సూత్రీక‌రించారు. 2019 ఎన్నిక‌ల్లో పార్టీల కూట‌మి సాధ్యం కాద‌నీ, అంద‌రూ ఒక గొడుగు కింద ఇమ‌డ‌లేర‌నీ అన్నారు. కానీ, భాజ‌పాయేత‌ర పార్టీల ఒకేఒక బ‌ల‌మైన ల‌క్ష్యం భాజ‌పాకి మ‌రోసారి అధికారం ద‌క్క‌కుండా చేయ‌డం. ఈ కామన్ పాయింట్ తో రోజురోజుకీ పార్టీల మ‌ధ్య ఐక్యత పెరుగుతోందన్న‌ది మ‌రోసారి రుజువైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close