ఆరో తేదీ నుంచి అసెంబ్లీ..! వైసీపీ సామూహిక రాజీనామాలా..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరో తేదీ నుంచి జరగనున్నాయి. కనీసం 10 పని దినాలు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సహజంగానే అసెంబ్లీ సమావేశాలంటే.. ముందుగా.. అందరి దృష్టి ప్రతిపక్ష పార్టీ వైపు పడుతుంది. ఎందుకంటే.. ఆ పార్టీ ఇప్పటికే రెండు సెషన్లుగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఈ సారి అయినా వస్తుందా రాదా అన్నదే ఆ సందేహం. నిజానికి ఇక అసెంబ్లీకే రాబోమని.. గతంలోనే ప్రకటించారు. కానీ రాజకీయ పరిణామాలు అంతకంతకూ మారిపోతున్నాయి. ఎన్నికల వాతావరణం వెడెక్కుతోంది. ఎమ్మెల్యేల నుంచే.. అసెంబ్లీకి వెళదామనే వినతులు.. జగన్‌కు అందుతున్నట్లు ప్రచారం కూడ జరుగుతోంది.

ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫైనల్. ప్రజలు ఎంపీలు, ఎమ్మేల్యేల్ని ఎన్నుకునేది.. ఇసుక దందాలు చేసుకోమనో.. ప్రజలపై పెత్తనం చేయమనో కాదు. కేవలం చట్టసభలకు వెళ్లి చట్టాలు చేయమనే. ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత ఇది. రాజ్యాంగం నిర్దేశించినది ఇదే. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్ట సభను ఏ మాత్రం నమ్మలేకపోతోంది. చట్టసభల్ని నమ్మకపోతే.. ప్రజాస్వామ్యాన్ని నమ్మనట్లేనని ఎవరు చెప్పినా వినిపించుకోవడం లేదు. ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించారు. అదీ కూడా.. ఉపఎన్నికలు రాని తేదీని చూసి.. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో.. అటు చట్టసభల్లో ఎంపీలతో …ఇటు వారిని ఎన్నుకున్న నియోజకవర్గాల ప్రతినిధి కూడా లేకుండా పోయారు. ఇదే పెద్ద సెల్ఫ్‌గోల్‌గా ప్రచారం జరిగింది. దీని తర్వాతనే చాలా మంది ఎమ్మెల్యేలు జగన్‌పై అసెంబ్లీకి వెళదామని ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో వివిధ వర్గాల నుంచీ.. అసెంబ్లీకి ఎందుకు వెళ్లరనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొత్త ఉపాధ్యాయుల సభలోనే అదే విమర్శ వినిపించింది.

కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఏది అనుకుంటే అది చేస్తారు. గతంలో కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకూ.. అసెంబ్లీకి రానని చెప్పారు. ఇప్పుడు దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నారు. అయితే.. కొత్తగా మరో ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. సామూహిక రాజీనామాలు. ప్రజల్లో సెంటిమెంట్ పెంచడానికి ఈ సామూహిక రాజీనామలు చాలా బాగా ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. ఎంపీలు రాజీనామాలు చేసి ఏం సాధించారు..? ఇప్పుడు తమతో ఎందుకు రాజీనామాలు చేయించాలనకుంటున్నారని.. వైసీపీ నేతలు మథన పడినా… న్యాయం చేయని అసెంబ్లీ స్పీకర్ తీరుకు నిరసగా రాజీనామాలు చేయాలని..జగన్ ఆదేశించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. చివరికి .. జగన్ కు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద అసలు నమ్మకం లేదని అనుకోవాల్సి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close