ఆరోజు జ‌గ‌న్ రాజీనామాలు చేయించ‌లేదన్న మంత్రి..!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి. ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయిస్తేనే అసెంబ్లీకి వ‌స్తార‌ని అంటున్నార‌నీ, కానీ గ‌తం మ‌ర‌చిపోయే జ‌గ‌న్ మాట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు. వైకాపా పార్టీ పెట్టిన తొలిరోజున త‌న‌తోపాటు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డితోపాటు ప్ర‌జారాజ్యం, టీడీపీ త‌ర‌ఫున గెలిచిన‌వారంతా 31 మందికి ఆరోజున వేదిక‌పై ఉన్నామ‌న్నారు. పార్టీ ఏర్పాటు చేసిన మొద‌టి రోజే ఆరోజు ‘మీ ప‌ద‌వుల‌కు రాజీనామా చెయ్యండి’ అని జ‌గ‌న్ ఎందుకు కోర‌లేద‌ని ప్ర‌శ్నించారు? ఆ మ‌ధ్య శిల్పా చ‌క్ర‌పాణిని వైకాపాలోకి చేర్చుకుంటూ టీడీపీకి రాజీనామా చేయించి గొప్ప సంస్కృతికి శ్రీ‌కారం చుట్టాన‌ని జ‌గ‌న్ అంటున్నార‌నీ, అదే రోజున టీడీపీ త‌ర‌ఫున గెలిచిన, ప్ర‌స్తుత ఛైర్ ప‌ర్స‌న్ సులోచ‌నని కూడా శిల్పాతోపాటు పార్టీకి రాజీనామా చేయాల‌ని ఎందుకు కోర‌లేద‌న్నారు? ఆమెతోపాటు కొంత‌మంది జెడ్పీటీసీలు, మండ‌ల ప్రెసిడెంట్ల‌ను టీడీపీకి రాజీనామా చేయ‌కుండానే ఎందుకు చేర్చుకున్నార‌న్నారు?

తాము కోట్లకు అమ్ముడుపోయామ‌ని ఆరోపిస్తున్నార‌నీ, త‌మ‌ని ఒక ద‌శ‌లో పందులు అని విమ‌ర్శించార‌నీ, ఆయ‌నే ఊర‌పంది అంటూ విమ‌ర్శించారు ఆది నారాయ‌ణ రెడ్డి. ఆయ‌న ఎన్ని కోట్లు కాజేశారో ఆయ‌న‌కే తెలీద‌నీ, వైకాపాకి తాము దూరం కావ‌డం వెన‌క స‌వాల‌క్ష కారణాలున్నాయ‌న్నారు. ప‌ట్టిసీమ‌కు మొద‌ట్నుంచీ అడ్డు త‌గిలార‌నీ, రాజ‌ధానిని రాష్ట్రం న‌డిబొడ్డున పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఆలోచిస్తే.. అలాంటి ఆలోచ‌న‌పై కూడా నెగెటివ్ గా మాట్లాడ‌మ‌ని చెప్పేవార‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌బ‌ట్టే వైకాపా నుంచి తాము బ‌య‌ట‌కి వ‌చ్చామ‌ని స‌మ‌ర్థించుకున్నారు. ఇక, రాజ‌శేఖ‌రెడ్డి గురించి చెప్పాలంటే బండెడు ఉన్నాయ‌నీ, ఎన్నెన్ని దురాగ‌తాలు జ‌రిగాయో మాకు తెలుసు అన్నారు. అసెంబ్లీలో ఎవ‌రైనా వైకాపా ఎమ్మెల్యే రాణింపుగా మాట్లాడితే జ‌గ‌న్ కి అనుమాన‌మ‌నీ, ఆయ‌న పాద‌యాత్రలో ఉండ‌గా వైకాపా ఎమ్మెల్యేల‌ను స‌భ‌కు పంపిస్తే, వారు కూడా టీడీపీలోకి వెళ్లిపోతారేమో అని ఆయ‌న‌కి అనుమానం అన్నారు. చిన్న‌పిల్లాడిలా నేను సీఎం అవుతా అవుతా అని జ‌గ‌న్ అంటుంటార‌నీ, ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌భ‌లో మాట్లాడ‌టానికి స‌భ్యుల్ని పంపించ‌లేని నాయ‌కుడు ఏ విధంగా అవుతారంటూ ఆది నారాయ‌ణ‌రెడ్డి విమ‌ర్శించారు.

ఫిరాయింపులే కార‌ణంగా చూపుతూ వైకాపా ఈ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయిస్తేనే వ‌స్తామ‌ని తాజాగా మ‌ళ్లీ ప‌ట్టుబ‌ట్టారు. అయితే, ఈ వాద‌న‌ను తిప్పి కొట్ట‌డం వ‌ర‌కూ గ‌తంలో త‌మ‌తో ఎందుకు రాజీనామాలు చేయించ‌లేదు అనే వాద‌న‌ను బాగానే వినిపించారు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. కానీ, ఎంత స‌మ‌ర్థించుకున్నా… ఫిరాయింపులు ఫిరాయింపులే! జంప్ జిలానీలు రాజీనామాలు చెయ్య‌క‌పోయినా ఫ‌ర్వాలేదు… అధికార పార్టీలో కాలం వెళ్ల‌దియ్యొచ్చు అనే ఒక కొత్త రాజ‌కీయ సంస్కృతికి వీరు శ్రీ‌కారం చుట్టారు! గ‌తంలో జ‌గ‌న్ రాజీనామాలు కోర‌లేదుకాబ‌ట్టి, ఇప్పుడు తాము చేసింది క‌రెక్ట్ అని స‌మ‌ర్థించుకోవ‌డం కూడా స‌రైంది కాదు క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close