ఎంవీవీఎస్ మూర్తి నేటి తరానికి ఆదర్శం..!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన జీవన పయనం ఎంతో మందికి ఆదర్శనం. విద్యాదానాన్ని మించినది లేదన్నట్లుగా.. నలుగురికీ విద్యను పంచితే.. ఎంత పేరు వస్తుందో.. ఆయనను చూస్తే తెలిసిపోతుంది. ఎన్నో వ్యాపారాలు చేసినా.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గీతం వ్యవస్థాపకునిగానే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తల్లిదండ్రులు పట్టాభిరామయ్య, మాణిక్యమ్మ.. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆయన కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1980లో గీతమ్ యూనివర్సిటీని నెలకొల్పి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1991లో విశాఖ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో రెండవసారి ఎంపిగా గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్సీగాను సేవలందించారు.

ఎంవీవీఎస్ మూర్తిది ఓ చరిత్ర. వైజాగు ప్రజానీకానికే కాదు, డీమ్డ్ యూనివర్శిటీ గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా కొన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు మూర్తి ఆత్మీయులు. ఆయన మరణం టీడీపీకి కూడా నష్టమే. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి కూడా లోటే. బాలయ్య బాలయ్య రెండో కూతుర్ని ఎంవీవీఎస్ మూర్తి మనమడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే బాలయ్య వియ్యంకుడి తండ్రే మూర్తి. మొన్నమొన్ననే హరికృష్ణను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన టీడీపీకి, చంద్రబాబుకు, బాలయ్యకు ఇది మరో షాక్. మరో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్వయానా ఈ మూర్తికి వియ్యంకుడు.

కెరీర్ ప్రారంభంలో కొన్నాళ్లు లాయర్ ప్రాక్టీస్ కూడా చేశాడు. వైజాగ్ బాట్లింగ్ కంపెనీని స్థాపించారు. అందుకే అప్పట్లో గోల్డ్ స్పాట్ మూర్తి అనేవారు తనను ఆ తరువాత ఆ వీబీసీ గ్రూపు అనేక వ్యాపారాల్లో అడుగు పెట్టింది. కోనసీమ పవర్ ప్రాజెక్టుతోపాటు వీబీసీ ఫెర్రో అల్లాయ్స్, మైనింగు, ఎడ్యుకేషన్, ఫర్టిలైజర్స్, కోల్ బెనిఫికేషన్, హాస్పిటాలిటీ ఇలా అనేక రంగాల్లోకి విస్తరించారు. వుడా ఛైర్మన్‌గా, విశాఖ పోర్టు ట్రస్టు, ఎల్ఐసీ, రిజీనల్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎఐఆర్ తదితర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లోనూ అనేక హోదాల్లో పనిచేశారు. గీతం ఇప్పుడు డీమ్డ్ యూనివర్శిటీ వైజాగ్, హైదరాబాదు, బెంగళూరులో కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close