రజనీని నలిపేశారు..! ఇప్పుడు సన్ని లియోన్ మీద పడ్డారు..!!

కర్ణాటకలో రజనీకాంత్ సినిమా “కాలా” సినిమా విడుదల కోసం.. ఆ చిత్ర దర్శక నిర్మాతలు పడిన కష్టాన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఇంతా చేసి.. రజనీకాంత్ ఏమి చేశారయ్యా.. అంటే… కావేరీ నీటి వివాదాన్ని కోర్టు చెప్పినట్లు సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. ఇదే తప్పయిపోయింది… కన్నడ సంఘాలకు. అంతే.. కాలా సినిమా మీద పడ్డారు. రిలీజ్ చేస్తే.. బాక్సులు బద్దలయిపోతాయని ధియేటర్ యాజమాన్యలను హెచ్చరించారు. సున్నితమైన విషయంగా మారిపోవడంతో.. చాలా మంది స్వచ్చందంగా సినిమాకు దూరంగా ఉన్నారు. కొంత కాలం గ్యాప్ వచ్చిందేమో.. కన్నడ సంఘాలకు ఇప్పుడు మరో పని పెట్టుకున్నారు. ఈ సారి రజనీ స్థాయి నుంచి సన్ని లియోన్ స్థాయికి దిగజారిపోయారు.

సన్నీలియోన్ “వీర మహా దేవి ” అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ.. “కర్ణాటక రక్షణ వెదిక” సభ్యులు ఆందోళనలుప్రారంభించారు. సన్నీ లియోన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సినిమా పోస్టర్లు దగ్ధం చేస్తూ.. ప్రదర్శనలు ప్రారంభించారు. “వీర మహా దేవి” సినిమాలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రధారి. ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించడం పై దక్షిణ భారత సంస్కృతికి అవమానం అనేది కన్నడ సంఘాల ఆందోళన . ఇందులో ఆమె పోరాట యోధురాలిగా కనిపించనున్నారు. ఆమె మహారాణి వీరమహాదేవిగా కనిపిస్తే తమ సంస్కృతిని దెబ్బతీసినట్లే అని ఆందోళనకారులు చెబుతున్నారు. సన్నీలియోన్ పోస్టర్లకు చెప్పుల దండలు వేస్తున్నారు.

వీరమహాదేవి సినిమా ఫస్ట్‌లుక్‌ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ వీరమహాదేవి.. ఎవరి జీవిత చరిత్ర ఆధారంగానూ తీయడం లేదని నిర్మాతలు చెబుతున్నారు. కానీ కన్నడ రక్షణ వేదిక సభ్యులు మాత్రం ఆగడం లేదు. తమకు చాలా రోజుల తర్వాత రోడ్ల మీదకు వచ్చే అవకాశం దొరికిందన్నట్లుగా చెలరేగిపోతున్నారు. వీళ్ల ఆందోళన సంగతేమో కానీ.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close