రూ.89 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సినిమా

మైత్రీ మూవీస్ అన‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాలే గుర్తొస్తాయి. జ‌న‌తా గ్యారేజ్‌, శ్రీ‌మంతుడు, రంగ‌స్థ‌లం.. ఇలా అన్నీ స్టార్ హీరోల‌తోనే చేశారు. ఇప్పుడు వ‌స్తున్న స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రెండూ భారీ చిత్రాలే. ఒక్కో సినిమాకీ దాదాపు రూ.60 నుంచి 70 కోట్లు పెట్ట‌క‌పోతే వాళ్ల‌కు సినిమా తీసిన‌ట్టే అనిపించ‌దు. అలాంటిది ఇప్పుడో చిన్న సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. దాని బ‌డ్జెట్ ఎంతో తెలుసా?? రూ.89 ల‌క్ష‌లు. రితీష్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్నాడు. సంగీతం, కెమెరా, ఎడిటింగ్‌, సీజీ.. ఈ డిపార్ట్‌మెంట్ల‌న్నీ కొత్త‌వాళ్ల‌తోనే నిండిపోబోతోంది. మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ కూడా మొద‌లెట్టేస్తార్ట‌.

మైత్రీ మూవీస్ నిర్మాత‌ల‌లో ఒక‌రైన న‌వీన్ మాట్లాడుతూ ”చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. మంచి సినిమా తీయ‌డ‌మే ముఖ్యం. స్టార్ హీరోల‌తోనే కాదు, కొత్త‌వాళ్ల‌తో కూడా ప్ర‌యోగాలు చేస్తాం. పెద్ద సినిమా పెట్టుబ‌డి తిరిగి రావ‌డానికి మూడు రోజులు ప‌డితే, చిన్న సినిమా హిట్ట‌యితే ప‌ది రోజులు ప‌డుతుంది. అంతే తేడా. చిన్న సినిమా కోసం ఓ మంచి టీమ్ దొరికింది. 89 ల‌క్ష‌ల్లో సినిమా పూర్తి చేస్తాం. ప‌బ్లిసిటీతో క‌లిపి రూ.1.5 కోట్లు అవుతుంది” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close