అనుకూలంగా రాయకపోతే శత్రువులేనా..? మీడియాపై కేటీఆర్ రుసరుసలెందుకో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి వారసుడు.. రెండు పత్రికల అధిపతులపై అసహనంతో ఉన్నారు. వారి సంగతి డిసెంబర్ పదకొండున చెబుతానంటూ హెచ్చరిస్తున్నారు. ఇంతకూ ఈ రెండు పత్రికల యజమానులు ఏం చేశారంటే… టీఆర్ఎస్‌కు అనుకూలంగా రాయలేదట. టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీస్తోందన్నట్లుగా.. రాయడమే కారణమట. ఆ పత్రికల యజమానులు.. చంద్రబాబుతో జట్టుకట్టి.. కేసీఆర్‌కు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా.. పని చేశాయంటున్నారు. ప్రజా ఫ్రంట్‌కు హవా ఉన్నట్లు మీడియా కథనాలు ప్రసారం చేసిందని.. మిత్రులెవరో, శత్రువులెవరో మాకు తెలిసిపోయిందని చెప్పుకొస్తున్నారు. అకస్మాత్తుగా న్యూస్‌ పేపర్లు కలర్లు మార్చేశాయంటున్నారు.

కానీ కేటీఆర్ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. కేసీఆర్ మనస్థత్వాన్ని ఎరిగిన వాళ్లు ఎవరైనా… ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. ఇలా ఎదురు తిరిగేవాళ్లు ఎవరూ ఉండరు కదా..! కేసీఆర్‌కు పరిస్థితులు బాగోలేవు కాబట్టి.. ఆయన ఓడిపోయే చాన్స్ ఉంది కాబట్టి.. ఇంత కాలం పెట్టిన నిర్బంధాలు… చేసిన వేధింపులు గుర్తుకు వచ్చి మీడియా తన విశ్వరూపం చూపించిందనుకోవాలి కదా..!. భయపెట్టి.. తాయిలాలిచ్చి.. “స్నేహితులు”గా చేసుకున్న మీడియా ఎప్పుడూ.. ఒక రకంగా ఉండదు. ఆ విషయాన్ని కేటీఆర్ గుర్తించలేపోతున్నారు. మీడియా వ్యతిరేకంగా మారిపోయిందని తెగ బాధపడుతున్నారు. లగడపాటి కానీ.. మీడియా కానీ.. ప్రజాభిప్రాయం ప్రకారమే వెళ్తారు…ఆ విషయం… రాజకీయాల్లో ఆలోచన లేని తనానికి, అధికారంతో వచ్చిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉండే కేటీఆర్‌కు అర్థం కాకపోవచ్చు.

ఎందుకంటే.. లగడపాటి కానీ.. ఆ పత్రికలు కానీ.. ప్రజల్లో విశ్వసనీయత సంపాదించడానికి కారణం… వారు నిజాలు చెప్పడమే. వారు చెప్పేవి అసత్యాలైతే.. ప్రజలు ఎప్పుడో తిరస్కరించేవారు. ఆ విషయం కేటీఆర్‌కు ఎన్నికల ఫలితాల తర్వాత అయినా అర్థం అవుతుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉప్పల్ లో మ్యాచ్ కు వాన గండం..?

మరికొద్ది గంటల్లో హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సి...

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close