బీజేపీ పట్ల అయిష్టత ప్రదర్శిస్తున్న మహబూబా ముఫ్తీ

త్వరలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనుకొన్న పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, తన తండ్రి స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ కి కేటాయించబడిన అధికార నివాసాన్ని ఖాళీ చేసి నాలుగు రోజుల క్రితం శ్రీనగర్ లోని తమ ఫెయిర్ వ్యూ బంగ్లాలోకి మారిపోయారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు బీజేపీ అంగీకరించినప్పటికీ, ఇంతవరకు ఆమె ప్రభుత్వ ఏర్పాటుకి చొరవ చూపలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆమెకు బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంలేదని చాటి చెప్పినట్లయింది.

దీనిపై బీజేపీ నేతలు ఎవరూ ఇంతవరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. రెండు వారాల క్రితమే ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ ఆమె అందుకు చొరవ చూపకపోవడంతో రాష్ట్రంలో తాత్కాలికంగా గవర్నర్ పాలన విధించారు. ఇప్పటికీ ఆమె సానుకూలంగా స్పందించకపోగా అధికార నివాసం ఖాళీ చేసి బీజేపీకి వ్యతిరేక సంకేతాలు పంపించారు.

“బీజేపీ-పిడిపిలు ఆరేళ్ళపాటు పొత్తులు కొనసాగించాలని ఇదివరకు నిర్ణయం జరిగింది. దానికి మేము నేటికీ కట్టుబడే ఉన్నాము. ముఫ్తీ మహామ్మద్ సాబ్ మృతి కారణంగా మేము ఎటువంటి పునరాలోచనలు చేయడం లేదు,” అని సీనియర్ బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తెలిపారు.

ఫిబ్రవరి మొదటి వారంలో ఆమె ప్రధాని నరేంద్ర మోడితో సమావేశామవ్వాలనుకొంటున్నట్లు పిడిపి నేతలు చెపుతున్నారు. ఒకవేళ ఆమె ఇంకా జాప్యం చేసినట్లయితే, బీజేపీ కూడా మళ్ళీ పావులు కదపడం ప్రారంభించవచ్చును. ప్రస్తుతానికి పిడిపి నుండి వస్తున్న ఇటువంటి సంకేతాలు బీజేపీకి ఏమాత్రం సానుకూలంగా కనబడటం లేదనే చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close