గడ్కరీని టీడీపీ మంత్రి అలా పొగిడేశారేంటి..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏపీకి వస్తున్నారంటే.. ముఖ్యంగా కేంద్రమంత్రివర్గంలో ఉన్న వారు… ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలకు కాలిపోతుంది. రాష్ట్రానికి చేసినంత అన్యాయం చేసి… మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారంటూ… వచ్చే నేతల స్థాయిని బట్టి దండయాత్రలు చేస్తూ ఉంటారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. టూర్‌ను రద్దు చేసుకున్నారు. పరిస్థితి ఇలా ఉందని.. ఏపీని వదిలేయలేని పరిస్థితి బీజేపీది. అందుకే వారానికో కేంద్రమంత్రిని ఏపీకి పంపించి.. ఏదో ఒకటి చెప్పాలని డిసైడయింది. దీనికైనా టీడీపీ నేతలు ఊరుకుంటారా..? అనే డౌటనుమానం బీజేపీకి ఉంది కాబట్టి.. మొల్లగా కడప నుంచి ప్రారంభించారు. కడప జిల్లాలో అయితే రహస్య మిత్రుడు జగన్‌కు చెందిన వైసీపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి… సేఫ్ పాసేజ్ ఉంటుందని.. దాని తర్వాత మెల్లగా ఇతర జిల్లాల్లో అడుగు పెట్టవచ్చని ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారం.. కేంద్రహోంమంత్రి..రాజ్‌నాథ్ సింగ్ మొదటగా కడపకు వచ్చారు. ఆయనను అడ్డుకుని అనవసరంగా రచ్చ చేయడం ఎందుకునుకున్నారేమో కానీ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయన చేసిన విమర్శలకు మాత్రం ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

ఆ తర్వాత వంతు… నితిన్ గడ్కరీది. ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. ఆయన పార్టీ వేదికలపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కానీ.. ప్రభుత్వ వేదికలపై మాత్రం… అంతులేని విధంగా పొగిడేశారు. ఏపీలో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నితిన్ గడ్కరీతో పాటు పాల్గొన్న మంత్రి అయ్యన్న పాత్రుడు… పొగడ్తలు కురిపించడంలో ఏ మాత్రం మొహమాట పడలేదు. పనిచేసే కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు. అందుకే గతంలో ప్రతి నెలా రాష్ట్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించేవారన్నారు. ఏపీలో గడ్కరీ సహకారంతో 13 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని సర్టిఫికెట్ ఇచ్ేచసారు. రాజకీయాలు ఉంటాయి..అలాగని సాయం చేసేవారిని మర్చిపోకూడదు అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎవరు సాయం చేసినా చేతులెత్తి దండం పెట్టాల్సిందే 16 వేల కోట్లతో పనులు చేపట్టిన గడ్కరీకి ఎన్ని దండాలు పెట్టాలని కృతజ్ఞత కూడా చూపారు.

అయ్యన్న స్పందన తెలుగుదేశం పార్టీ వర్గాల కన్నా… బీజేపీ నేతలనే ఎక్కువ ఆశ్చర్య పరిచింది. కారణం .. ఢిల్లీ రాజకీయాలే. ఇటీవలి కాలంలో.. ఆరెస్సెస్ మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని ప్రొత్సహిస్తోందని చెబుతున్నారు. అందుకే.. మోడీ, షాలపై గడ్కరీ అప్పుడప్పుడూ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారని చెబుతున్నారు. గడ్కరీ అలా మాట్లాడటం వెనుక.. చంద్రబాబు ఉన్నారంటూ.. సాక్షి పత్రిక అప్పుడప్పుడూ కొత్త కోణాలు ఆవిష్కరిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా అయితే.. ఇలాంటి కథనాలు కారణం లేకుండా ఏ పత్రిక రాయదు. అది నిజమేమో అని బీజేపీ నేతలు అనుకునేలా అయ్యన్న పాత్రుడు గడ్కరీని పొగిడేశారు. రాజకీయం అంటే ఇదేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close