మహర్షికి ఎలక్షన్స్ సమస్యేనా?

సూపర్ స్టార్ మహేష్-దర్శకుడు వంశీ పైడిపల్లిల కాంబినేషన్ లో రెడీ అవుతున్న సినిమా మహర్షి. అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఓ పల్లెకు రావడం, మహర్షిలా మారడం, ఇలాంటి వ్యవహారాలేవో వున్నాయి. ఆ మాటకు వస్తే, ఓ అత్యంత దనవంతుడైన వ్యాపారవేత్త కోట్ల నష్టపోయి మహర్షిలా మారిన పాయింట్ తో రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ఎప్పుడో మహర్షి అనే నవల రాసారు. అది వేరే సంగతి.

సరే, పాయింట్ కు వస్తే, ఏప్రియల్ 25న మహర్షి విడుదలకు ముహుర్తం పెట్టారు. కానీ ఇప్పుడు ఇదే ఆ సినిమాకు ఇబ్బంది అవుతుందేమో అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు త్వరలో రాబోతోంది. ఆంధ్రలో ఏప్రియల్ 20 నుంచి 30 మధ్యనో లేదా 20 నుంచి మే ఫస్ట్ వీక్ మధ్యనో ఎన్నికల హడావుడి వుంటుందని వినిపిస్తోంది.

కీలకప్రచారం ఏప్రియల్ ఆఖరివారంలోనే వుండొచ్చని అంచనా. ఎన్నికల టైమ్ లో సినిమాలకు పెద్దగా గిరాకీ వుండదని ట్రేడ్ వర్గాల బోగట్టా. ముఖ్యంగా ఈసారి ఆంధ్ర ఎన్నికలు చాలా పోటా పోటీగా జరగబోతున్నాయి. మూడు పార్టీలకు ప్రచారానికి జనం కావాలి. సినిమాకు వెళ్తే ఖర్చు. అదే ప్రచారానికి వెళ్తే ఆదాయం.

మరి మహర్షి డేట్ ను మే ఫస్ట్ వీకు మారుస్తారా? లేక జనాల దగ్గర ఎన్నికల డబ్బులు బాగా ఆడతాయి కాబట్టి , సినిమాకు బాగుంటుందని అనుకున్నడేట్ కే ముందుకు వెళ్తారా? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close