తెలంగాణ ఓటాన్ అకౌంట్ పద్దు బడ్జెట్ రూ. 1,820,17 కోట్లు..! సంక్షేమానికే సింహభాగం..!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటుతుందన్న అంచనాలను.. కేసీఆర్.. తలకిందులు చేశారు. కేవలం రూ. 1, 82, 017 కోట్లతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు రూ.1,74,453 కోట్లు. అంటే.. గత ఏడాదితో పోలిస్తే.. బడ్జెట్ కేవలం రూ. ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది. కానీ.. సంక్షేమ శాఖలకు కేటాయింపులు మాత్రం భారీగా పెంచారు. ఎన్నికల్లో హామీల అమలు చేయడానికి నిధులు కేటాయించారు. రైతు బంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించారు. నిజానికి ఎకరానికి రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దాని ప్రకారం.. నిధులు పెంచాల్సి ఉంది. అయితే.. కేంద్ర కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా.. దీనిలో కలిపిస్తే.. ఆ మిగులు నిధులు కవర్ చేసుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆసరా పెన్షన్లకు రూ. 12.067 కోట్లు కేటాయించారు. వయసు పరిమితి తగ్గించినందుకున.. రూ. పదిహేను వేల కోట్ల వరకూ అవసరం అవుతాయని అంచనాలు వేశారు. అయినా పన్నెండు వేల కోట్లకే పరిమితం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీ రుణమాఫీ. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రకారం.. రూ. ఆరు వేల కోట్లు.. ఈ రుణమాఫీకి కేటాయించారు. నిరుద్యోగ భృతి రూ. 1.810 కోట్లు కేటాయించారు. ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 16,581 కోట్లు, ఎస్టీలకు రూ. 9827 కోట్లు., మైనార్టీలకు రూ. 2004 కోట్లు, ఈఎన్టీ, దంత పరీక్షలకు రూ. 5,536 కోట్లు , రూపాయి కిలో బియ్యానికి రూ. 2744 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 22,500 కోట్లు కేటాయించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌లకు రూ. 1,450 కోట్లు, రైతు బీమా రూ. 650కోట్లు వెచ్చిస్తున్నారు. పంట కాలనీల కోసం కొత్తగా రూ. ఇరవై వేల కోట్లకుపైగానే కేటాయించారు. మొత్తంగా బడ్జెట్‌లో… బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం రూ. 1,07, 302 కోట్లు కాగా.. నిర్వహణ పద్దురూ. 74.115 కోట్లుగా నిర్ధారించారు. హైదరాబాద్ చుట్టూ మరో రీజినల్ రింగ్ రోడ్డుకు.. నిధులు కేటాయించారు.

కేసీఆర్.. గత ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని… బడ్దెట్ పద్దును పెట్టే సమయంలో వివరించారు. రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని గర్వంగా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించిందన్నారు. అలాగే.. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించినట్లుగా… ఈ సారి ఈఎన్టీ వైద్య సేవలు ప్రజలకు అందించబోయే.. తొలి రాష్ట్రం తెలంగాణనేనని… ఉత్సాహంగా ప్రకటించారు. దాదాపుగా ప్రతి సందర్భంలోనూ… సమైక్య రాష్ట్రంలోని పరిస్థితిని పోల్చి.. కేసీఆర్.. తాజా అభివృద్ధిని వివరించారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినందున.. ఇప్పుడు.. తాము కూడా.. ఓటాన్ అకౌంటే ప్రవేశ పెట్టామని… అందుకే.. పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టిన తర్వాత .. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుందని ప్రకటించారు. అప్పుడే.. కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత వస్తుందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close