డ‌బ్బుల‌కు ప‌డిపోను: ఛార్మి

‘జ్యోతి ల‌క్ష్మి’ త‌ర‌వాత ఛార్మి తెర‌పై క‌నిపించ‌లేదు. పూరి క‌నెక్ట్స్ పేరుతో ఓ సంస్థ స్థాపించి – పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల‌కు చేదోడు వాదోడుగా ఉంటోంది. `ఇస్మార్ట్ శంక‌ర్‌`కు తాను కూడా ఓ నిర్మాతే. ఇక సినిమాల్లో క‌నిపించ‌రా? అని అడిగితే ”జ్యోతిల‌క్ష్మి త‌ర‌వాత సినిమాల‌కు దూర‌మ‌వ్వాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నా. ప‌దిహేనేళ్లుగా న‌టిస్తూనే ఉన్నా. నాకు న‌ట‌న‌పై బోర్ కొట్టేసింది. అందుకే కెమెరా ముందుకు రావ‌డం లేదు. జ్యోతిల‌క్ష్మి త‌ర‌వాత నాకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ వ‌స్తున్నాయి కూడా. ఐటెమ్ గీతాలకూ అడుగుతున్నారు. భారీ మొత్తంలో పారితోషికం ఇస్తాన‌న్నారు. కానీ.. నేను డ‌బ్బుల‌కు ప‌డిపోయే ర‌కాన్ని కాదు. ఒక్క‌సారి వ‌ద్ద‌నుకున్నానంటే.. ఆ మాట మీదే ఉంటాను. ఇక న‌ట‌న‌కు స్వ‌స్తి ప‌లికిన‌ట్టే. ప్ర‌స్తుతం నిర్మాణ రంగంపైనే దృష్టి పెట్టా. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ త‌ర‌వాత కూడా వ‌రుస‌గా సినిమాలు తీస్తూనే ఉంటా” అంటోంది.

పూరితో ఈ అనుబంధం ఎలా మొద‌లైంది? అని అడిగితే.. దానికి స‌మాధానం చెబుతూ ”పూరి అంటే నాకు ఎన‌లేని అభిమానం. నా పౌర్ణ‌మి సినిమాతో పాటు పోకిరి కూడా విడుద‌లైంది. నా సినిమా ప‌క్క‌న పెట్టి.. పోకిరి సినిమాని మూడు సార్లు చూశా. ఆయ‌న గొప్ప క‌థ‌కుడు. గొప్ప ద‌ర్శ‌కుడు. త‌ప్ప‌కుండా ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో త‌న హ‌వా మ‌రోసారి చూపిస్తారు. ఈసినిమా చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతుంది” అని ధీమాగా చెప్పుకొచ్చింది ఛార్మి. అన్న‌ట్టు శుక్ర‌వారం ఛార్మి పుట్టిన రోజు. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ షూటింగ్ కోసం గోవా వెళ్లింది ఛార్మి. త‌న పుట్టిన రోజు వేడుక‌లు కూడా అక్క‌డే జ‌రుపుకోబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close