కారు టాప్ గేర్..! పరిషత్ పోరులో వన్ సైడ్ వార్..!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురులేకుండాపోయింది. అన్ని జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. కారు స్పీడ్‌ ధాటికి.. కాంగ్రెస్ అభ్యర్థులు కకావికలం అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ 3 వేల 555 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ 13 వందల 77, బీజేపీ 211, టీడీపీ 21 స్థానాలను కైవసం చేసుకున్నాయి. 571 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. అటు జడ్పీటీసీ ఫలితాల్లోనూ కారు జోరే కనిపిస్తోంది. మొత్తం 538 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు 418 జడ్పీటీసీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 61, బీజేపీ 7, ఇతరులు 4 స్థానాల చొప్పున గెలుపొందారు.

జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క జిల్లాలోనూ జడ్పీ పీఠాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు. అలాగే.. 80శాతం మండల పరిషత్ పీఠాలు కూడా.. టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో.. భవిష్యత్‌పై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ పార్టీకి… ఈ ఎన్నికలు ఓ రకంగా షాక్‌ లాంటివే. గ్రామాల్లో ఒకప్పుడు తిరుగులేని విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఆ స్థానాన్ని టీఆర్ఎస్‌కు వదిలేసుకున్నట్లయింది.

పార్టీ పరంగా టీఆర్ఎస్‌ సత్తా చాటినా ముఖ్య నేతలకు చెందిన ప్రాంతాల్లో ఆ పార్టీకి షాక్‌ తప్పడం లేదు. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామంలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. కరీంనగర్‌ జిల్లా చినముల్కనూర్‌ ఎంపీటీసీగా స్వతంత్ర అభ్యర్థి రాజేశం గెలుపొందారు. కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవితకు మరోసారి బీజేపీ షాక్‌ ఇచ్చింది. ఆమె స్వగ్రామమైన నవీపేట మండలం పోతంగల్‌లో కూడా టీఆర్ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థిపై 86 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కె.రాజు గెలుపొందారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close