“బిగ్ బాస్” వాయిదా యోచనలో స్టార్ మా..!

బిగ్ బాస్ మూడో సీజన్‌కు ఆరంభ గండం ఎదురయింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, కోర్టుల్లో కేసులు, నాగార్జున హోస్టింగ్ పై వస్తున్న విమర్శలు.. కలగలిపి.. ఈ షో మొత్తానికే వాయిదా పడే పరిస్థితి వచ్చింది. నాగార్జున ఇంటిని, అన్నపూర్ణా స్టూడియోనూ.. ఓయూ విద్యార్థులు ముట్టడించారు. అంతకు ముందే… బిగ్ బాస్ నిర్వాహకులు.. అవకాశాల పట్ల.. నటీమణులతో .. కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నారని..మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. పరిస్థితి రాను రాను సీరియస్‌గా మారుతోంది. దీంతో.. నాగార్జున కూడా హోస్ట్‌గా ఉండేందుకు వెనుకాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ తరుణంలో.. నాగార్జునతో.. స్టార్ మా ప్రతినిధులు భేటీ అయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు.

నిజానికి బిగ్ బాస్ మూడో సీజన్ ఆదివారం నుంచి.. అంటే రేపటి నుంచే ప్రారంభం కానుంది. షో ప్రతీ సారి ఒక రోజు ముందుగానే ఉంటుంది కాబట్టి.. కంటెస్టంట్లు అంతా.. ఈ పాటికి బిగ్ బాస్ హౌస్‌లోకి చేరుకుని ఉంటారు. ఓపెనింగ్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేసి ఉంటారు. అయితే.. నాగార్జున.. హోస్ట్ గా ఉండేందుకు వెనుకాడుతూండటం.. అదే సమయంలో… వివాదాలు పెరిగిపోతూండటంతో… షోను.. వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో.. స్టార్ మా యాజమాన్యం ఉన్నట్లుగా చెబుతున్నారు. బిగ్ బాస్ షోలోకి తమకు అవకాశం రాకపోవడానికి కారణం కాస్టింగ్ కౌచేనని.. శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. బిగ్ బాస్ నిర్వాహకులు.. అరెస్ట్ చేయకుండా.. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతటితో వదిలి పెట్టబోమని.. గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుతం స్టార్ మాలో.. బిగ్ బాస్ ప్రమోషన్లు కూడా..కనిపించడం లేదని.. ప్రేక్షకులు చెబుతున్నారు. వాయిదా దిశగా ఉండటం వల్లనే… పెద్దగా హైలెట్ చేయడం లేదని.. భావిస్తున్నారు. అదే సమయంలో.. ప్రొకబడ్డీకి మాత్రం.. ఎక్కడ లేని పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు బిగ్‌బాస్ షోను వాయిదా వేసి.. వివాదాలన్నీ పరిష్కరించుకున్న తర్వాతనే ప్రారంభించవచ్చని… టీవీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి..షో రేపే ప్రారంభం కాబట్టి… ప్రారంభిస్తారో.. వాయిదా వేస్తారో.. ఈ రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close