చంద్రబాబు భద్రతను లైట్ తీసుకోని కేంద్రం..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను.. మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం లైట్ తీసుకోలేదు. పరాజయం పాలైనప్పటికి.. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రతను తగ్గించడం.. మంచిది కాదని కేంద్రం అనుకుంది. ఈ మేరకు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీఐపీల భద్రత సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. మాజీలైనప్పటికీ చంద్రబాబు నాయుడు, ఫరూక్ అబ్దుల్లాలకు ముప్పు ఉందని.. గుర్తించి.. ఆ మేరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో రక్షణ కొనసాగించనున్నారు. అదే సమయంలో పలువురు నేతలకు.. భద్రతను తగ్గించడమో.. తొలగించడమో చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు.. జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించారు.

దేశంలో కేవలం పన్నెండు మందికి మాత్రమే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ కల్పిస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. భద్రతా సమీక్ష కమిటీ.. దీనిపై.. నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు.. ఈ మోడీ రెండో సారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి సమావేశం జరిగింది. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వారికి.. కేంద్ర బలగాలతో పాటు.. రాష్ట్ర బలగాలు కూడా.. ఆ స్థాయికి తగ్గట్లుగా రక్షణ కల్పించాలి. కానీ.. చంద్రబాబు.. ఓడిపోయిన తర్వాత.. ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్… చంద్రబాబు భద్రతను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ పైలెట్‌ను తొలగించారు. టూ ప్లస్ టూ మాత్రమే సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చెంది.. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.

ప్రస్తుతం.. చంద్రబాబు భద్రతకు సంబంధించిన పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది. మాజీ సీఎం భద్రత అత్యంత సున్నితమైన విషయం కాబట్టి… బహిరంగ కోర్టులో విచారణ వద్దని.. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదించడంతో.. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలేమీ బయటకు రావడం లేదు. కానీ… పోలీసులు మాత్రం.. చంద్రబాబు… జడ్ ప్లస్ కు తగ్గట్లుగానే… భద్రత కల్పిస్తున్నామని.. మొదట్లో కోర్టుకు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close