వరద రాజకీయంలో చిక్కుకున్న చంద్రబాబు నివాసం..!

ఎగువ నుంచి వస్తున్న వరదతో.. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పరివాహక ప్రాంతాలు ముంపు ముప్పులో పడ్డాయి. శ్రీశైలం నుంచి .. ప్రకాశం బ్యారేజీ వరకు.. పలు చోట్ల… కృష్ణా తీర గ్రామాలు నీటి ముంపులో ఇరుక్కున్నాయి. అయితే.. ఎక్కడా పెద్దగా అధికారుల జాడ కనిపించడం లేదు. గ్రామస్తులు.. చేతికి అందిన సామాన్లతో… వీలైనంత దూరం వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. వారికి కనీస అవసరాలు చూసేవారు కూడా కరవయ్యారు. ప్రభుత్వాధికారులు… కనీసం వచ్చి పలకరించను కూడా పలకరించడం లేదు. దాంతో.. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.

అయితే.. గుంటూరు జిల్లా అధికారులు మాత్రం… ఒక్క చోట పూర్తిగా దృష్టి కేంద్రకరించారు. ఉదయం నుంచి… అ ప్రాంతం దగ్గరకు గుంటూరు కలెక్టర్ సహా.. ఉన్నతాధికారులు హడావుడిగా వచ్చి పరిశీలించి వెళ్లారు. డ్రోన్ కెమెరాలతో.. దృశ్యాలను చిత్రీకరించారు. వరద ముప్పు ఎలా ఉంటుందో.. అంచనా వేసుకున్నారు. అయితే.. ఆ ప్రాంతం… పేదలు నివాసం ఉండే.. ఏరియా కాదు. అక్కడి ప్రజల్ని తరలించే కార్యక్రమం కోసమూ ఆ హడావుడి చేయడం లేదు. వారు అత్యంత ఆసక్తి చూపిస్తున్న అ ప్రాంతం.. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ భవనం… ఉన్న ప్రాంతం. ఆ ఇంట్లోకి నీళ్లు ఎప్పుడు వస్తాయా.. అన్నట్లుగా.. గంటకోసారి వచ్చి చూసి.. వెళ్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అయితే.. అక్కడే మకాం వేశారు.

బాధితులు ఇతర ప్రాంతాల్లో సాయం కోసం హాహాకారాలు పెడుతున్నా… పట్టించుకోని అధికారులు.. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమో అని మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంతకంతకూ పెంచే ప్రయత్నం చేస్తున్నారని… ప్రకాశం బ్యారేజీ నుంచి.. సమయానికి నీళ్లు వదలకుండా… ఈ ప్రయత్నం చేశారని.. టీడీపీ నేతలు.. కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులంతా.. చంద్రబాబు నివాసంపైనే దృష్టి పెట్టారు. డ్రోన్ కెమెరాలతో కూడా చిత్రీకరణ చేయడంతో.. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నేతలు.. అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆందోళనకు దిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close