ఫస్ట్ జీవో మాయ..! ఆశావర్కర్లు మోసపోయినట్లే..!?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సచివాలయంలో.. మొదటి సారిగా.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చేసిన మూడు సంతకాల్లో మొదటిది.. ఆశావర్కర్లకు జీతం రూ. పదివేలు చేయడం. దీనిపై జాతీయ మీడియాలోనూ విస్తృతమైన కవరేజీ లభించింది. సేవ చేస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి సముచితమైన గౌరవం ఇచ్చారని.. ప్రశంసించారు. కానీ మూడు నెలలు తిరిగే సరికి… అదే ఆశావర్కర్లు.. రోడ్డెక్కారు. వారు డిమాండ్ ఒక్కటే.. తమకు.. జగన్ మోహన్ రెడ్డి ఇస్తామని చెప్పి.. జీవో విడుదల చేసిన రూ. పదివేల జీతం ఇవ్వాల్సిందేనని. అదేంటి… సీఎం మొదటి సంతకం పెట్టినా.. ఎందుకివ్వడం లేదనేది.. చాలా మందికి అర్థం కాని విషయం.

జగన్మోహన్ రెడ్డి జూన్ ఎనిమిదో తేదీన ఆశావర్కర్ల జీతాలు పెంపుపై సంతకం పెట్టారు. అయితే దానికి సంబంధించిన జీవో రెండు నెలల తర్వాత ఆగస్టు ఏడో తేదీన జీవో విడుదల చేశారు. పెంచిన జీతాలు.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా.. పెంచిన జీతం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. కానీ ఆ పదివేలు సంతకానికేనని.. అసలు రాదని తేలిపోయింది. పైగా… ఓ కొత్త గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాని ప్రకారం.. ఆశా వర్కర్లలో.. కనీసం సగం మందిని మూడు నెలల్లో తీసేయబోతున్నారు.

జగన్మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో ప్రకారం.. ఆశావర్కర్ల పనితీరును.. కనీసం పది మంది అసెస్‌మెంట్ చేస్తారు. అందరూ మంచి గ్రేడ్లు ఇవ్వాలి. ఆ గ్రేడ్ ప్రకారం వస్తేనే రూ. పదివేల జీతం వస్తుంది. కానీ… ఆ గ్రేడ్ రావడం.. అనేది సాధ్యం కాదు. కానీ.. గ్రేడ్ సిస్టం వల్ల ఆశావర్కర్లు మూడు నెలలపాటు రూ. 3,500 వస్తే ఉద్యోగం ఆటోమేటిక్‌గా పోతుంది. దీంతో ఆశావర్కర్లు హతాశులయ్యారు. ఉన్నది పోయింది.. ఉంచుకున్నదీ పోయిందన్న చందంగా.. పాత జీతాలు ఇవ్వలేదని, కొత్త జీతాలు కూడా అమలు చేసే పరిస్థతిలేదని ఆందోళనతో వారంతా రోడ్డెక్కారు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని పోలీసులతో లాగించి పడేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close