టీటీడీ బోర్డులోకి మళ్లీ శేఖర్ రెడ్డి..! ఇదే కదా అవినీతి అంటే..!?

24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఏర్పడిన టీటీడీ పాలకమండలిలో కొత్తగా.. మరో ఏడుగురికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా చాన్సిచ్చారు. వీరిలో తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి ఉండటం కలకలం రేపుతోంది. టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన కరుణాకర్ రెడ్డి , శేఖర్‌రెడ్డి, రాకేష్‌ సిన్హా, కుపేందర్‌ రెడ్డి గోవింద హరి, దుష్మంత్‌కుమార్‌, ఆమోల్‌ కాలే లను నియమించారు. శేఖర్ రెడ్డి ఏపీ ప్రజలకే కాదు.. దేశం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే నోట్లను రద్దు చేసినప్పుడు.. ప్రజలంతా.. చెల్లుబాటయ్యే నోటు ఒక్కటంటే.. ఒక్కదాని కోసం.. ఏటీఎంల ముందు. రోజంతా పడిగాపులు పడుతున్న సమయంలో. ఈ శేఖర్ రెడ్డి ఇంట్లో.. కోట్లకు కోట్ల కొత్త నగదు పట్టుబడింది.

ఏటీఎంలలో పెట్టడానికి నగదే లేదని ఆర్బీఐ అంటోన్న సమయంలోనే… అంతకు మించిన నిధి.. ఆయన ఇంట్లో దొరికింది. అందుకే.. అప్పుడు ఆయన.. దేశం మొత్తం హాట్ ఫేవరేట్ అయ్యారు. అప్పట్లో ఇది ఒక సంచలనం అయ్యింది. ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ బీజేపీ, వైసీపీ విమర్శలు చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి … దాంతో పాటు సాక్షి… చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. శేఖర్ రెడ్డి వద్ద పట్టుబడిన సొమ్ము అంతా.. చంద్రబాబుదని.. లోకేష్ దని రోజువారీ కథనాలు ప్రసారం చేశారు. చివరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ శేఖర్ రెడ్డికి.. లోకేష్‌కు కూడా లింక్ పెట్టారు.

అన్ని రాజకీయ ఆరోపణలు ముగిసిన తర్వాత ఇప్పుడు.. అదే శేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి … టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించారు. అప్పట్లో పట్టుబడిన డబ్బు విషయంలో శేఖర్ రెడ్డి కోర్టు క్లీన్ చిట్ లభించింది. కోర్టులో సీబీఐ సరైన వాదనలు వినిపించలేదు. అది అక్రమ సంపాదన కాదని కోర్టు తేల్చింది. శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ వచ్చిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తనను అన్యాయంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి తొలగించాలని.. తనకు మళ్లీ మెంబర్ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశారు. మొత్తానికి శేఖర్ రెడ్డి వెనుక ఉన్నది చంద్రబాబు, లోకేష్ కాదని.. జగన్మోహన్ రెడ్డి అని అనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని.. టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close