చైతన్య : ఆర్టీసీని రైట్ ట్రాక్‌లో పెడుతున్న కేసీఆర్..!

ఇప్పుడు అందరూ ఆర్టీసీ సమ్మె గురించే మాట్లాడుకుంటున్నారు. ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల గురించే చర్చించుకుంటున్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమన్న సంకేతాన్ని కేసీఆర్ పంపుతున్నారు. విపక్షాలు. ఆర్టీసీ ఆస్తుల దగ్గర్నుంచి గతంలో.. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసినప్పటి పరిస్థితుల గురించి వివరిస్తూ… తెలంగాణ సీఎం… అన్యాయం చేస్తున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఇప్పుడు ఇలా కఠినంగా వ్యవహరించకపోతే… ఆర్టీసీ మరిన్ని అప్పుల్లో కూరుకుపోతుంది. ఆ తర్వాత.. ఉద్యోగులు రోడ్డున పడతారు. అప్పుడు ప్రభుత్వానికి మరింత భారం అవుతుంది.

ఆర్టీసీని కాపాడుకోవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు..!

రాంగ్ రూట్లో వెళ్తున్నాడని భారీ జరిమానాలు విధించడం కరెక్ట్ కాదని కొందరి వాదన.. అయితే అదే రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రమాదానికి గురైతే.. ఎవరికి నష్టం..?. అలా ఎవరూ రాంగ్ రూట్లోకి వెళ్లకుండా ఉండటానికి ప్రభుత్వాలు తన వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ ట్రాక్ తప్పకుండా ఉండటానికి కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే కేసీఆర్‌పై … నియంతలా వ్యవహరిస్తున్నారన్న వాదనను ప్రతిపక్షం తెరపైకి తెచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో ప్రభుత్వం.. సున్నితమైన ఆర్టీసీ సమస్యపై ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ రాజకీయ ప్రయోజనాల కన్నా.. ఆర్టీసీ ప్రయోజనాలే ముఖ్యమని కేసీఆర్ గుర్తించారు. ఆర్టీసీని కాపాడుకోవాలంటే.. కఠినంగా వ్యవహరించక తప్పదని నిర్ణయించుకున్నారు.

ఉద్యోగుల తీరుపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత..!

ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో సాధారణంగా కాస్తంత వ్యతిరేకత ఉంటుంది. లంచాలు తీసుకుంటారని… తాము కట్టే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ తమను వేధిస్తూంటారని సామాన్య ప్రజలకు ఓ అభిప్రాయం ఉంది. కేసీఆర్ దీన్ని గుర్తించారు. ఉద్యోగుల్ని మంచి చేసుకునేదుకు వారికి తాయిలాలు ప్రకటించడం కన్నా… వారి విషయంలో కఠినంగా ఉండి ప్రజల మద్దతు పొందడం సులువని అంచనా వేసుకున్నారని చెబుతున్నారు. అందుకే.. కొంత కాలంగా.. ప్రభుత్వ శాఖల్లో అత్యధికంగా అవినీతి ఉంటుందనే అభిప్రాయం ఉన్న రెవిన్యూ శాఖను టార్గెట్ చేశారు. ఇప్పుడు.. ఆర్టీసీ కార్మికుల వంతు అయింది. ఆర్టీసీ వేల కోట్ల నష్టాల్లో ఉన్నా.. కార్మికులు… బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. కేసీఆర్ అంటున్నారు. ఒక్కో ఉద్యోగి యాభై వేలకు పైగా జీతం తీసుకుంటున్నా… ఇంకా కావాలని అంటున్నారని చెబుతూ… వారిపై వేటు వేశారు. దీంతో సహజంగానే.. ఆర్టీసీ ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని… వారి విషయంలో కేసీఆర్ కరెక్ట్ చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వారికి దండిగానే జీతాలు అందుతున్నాయని ప్రజలు కూడా ఓ అంచనాకు వచ్చారు.

కేసీఆర్ చెప్పినట్లుగా చెస్తే లాభాల్లోకి ఆర్టీసీ..!

ఉద్యోగులు సమర్థంగా పని చేస్తే.. పాలనకు తిరుగు ఉండదు. వారు తీసుకుంటున్న జీతాలకు తగ్గట్లుగా పని చేస్తే.. బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. తెలంగాణ వచ్చిన వెంటనే అందరికీ దండిగా జీతాలు పెంచిన కేసీఆర్ అదే మాట చెప్పారు. కానీ ఉద్యోగుల్లో మార్పు రాలేదు. దాంతో కేసీఆర్.. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఉద్యోగులను సంస్కరించడానికి తన వంతు అడుగు ముందుకేశారు. ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసినా వెనుకడుగు వేయడం లేదు. ఉద్యోగులు ఇక ఆర్టీసీకి లేరన్నట్లుగా వ్యవహరిస్తూనే… కొత్త నియామకాలు.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో.. బస్సులు ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేసీఆర్ చర్యలు ఫలించి.. ఆర్టీసీ లాభాల్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close