బోయ‌పాటి పారితోషికంలో భారీ కోత‌?

ఒక ద‌శ‌లో రూ.15 కోట్ల పారితోషికంతో… హ‌డ‌లెత్తించాడు బోయ‌పాటి శ్రీ‌ను. త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ‌ల‌తో స‌మానంగా పారితోషికం డిమాండ్ చేశారు. విన‌య‌ విధేయ‌ రామాకి బోయ‌పాటి అందుకున్న పారితోషికం రూ.15 కోట్ల‌కు అటూ ఇటూగా ఉంది. అయితే స‌డ‌న్‌గా బోయ‌పాటి పారితోషికం స‌గానికి ప‌డిపోయింది. అది కూడా వియ‌న విధేయ‌ రామా ఎఫెక్ట్‌తోనే.

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా త‌యార‌వుతోంది. ఈ సినిమాకి గానూ బోయ‌పాటి శ్రీ‌ను పారితోషికం రూ.8 కోట్లేన‌ని తేలింది. విన‌య విధేయ రామా ఎఫెక్ట్ తో పారితోషికం త‌గ్గింది. దాంతో పాటు మ‌రో కార‌ణం కూడా ఉంది. బాల‌కృష్ణ సినిమాకి భారీ బ‌డ్జెట్ అవ‌స‌రం అవుతోంద‌ట‌. బాల‌య్య మార్కెట్ రేంజ్ దాటి మరీ ఖ‌ర్చు చేయాల్సివ‌స్తోంద‌ట‌. క్వాలిటీ కోసం త‌న పారితోషికం త‌గ్గించుకోవ‌డానికి బోయ‌పాటి సిద్ధ‌మ‌య్యాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. త‌న సినిమాల్లో స్టార్ కాస్టింగ్ విష‌యంలో బోయ‌పాటి ఏమాత్రం రాజీ ప‌డ‌డు. ఇప్ప‌టికే సంజ‌య్‌ద‌త్ లాంటి వాళ్ల‌ని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నాడు. స్టార్లు పెరిగే కొద్దీ – సినిమాకి ఖ‌ర్చు పెరుగుతుంది. అందుకే.. త‌న పారితోషికంలో కొంత మిన‌హాయిస్తున్నాడు. ఈ సినిమా హిట్ట‌యి, మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తే…. మళ్లీ రూ.15 కోట్ల మార్క్‌ని చేరుకోవ‌డం తేలిక‌వుతుంది. అందుకే ఇప్పుడు త‌న దృష్టంతా మేకింగ్‌పైనే పెడుతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close